సిద్ధం సభలపై టిడిపి ఆత్మవంచన చేసుకుంటుందా?
సిద్ధం సభలపై టిడిపి ఆత్మవంచన చేసుకుంటుందా?
నాలుగో ముగింపు సిద్దం సభ 16వ నంబరు జాతీయ రహదారిపై మేదరమెట్ల సమీపంలో గ్రాండ్ సక్సెస్ అయింది..
అయితే టిడిపి సోషల్ మీడియా అనుకూల మీడియాలో నామమాత్రమైన జనం వచ్చారు అని కొన్ని విజువల్స్ పెట్టి ప్రచారం చేస్తున్నారు..
తటస్థంగా ఉండే టీవీ చానల్స్ నేషనల్ మీడియా సీఎన్ఎన్ ఛానల్ కూడా లైవ్ టెలికాస్ట్ చేశాయి..
అత్యద్భుతంగా జన సంద్రం తరలి రావడంతో పాటు సీఎం జగన్ నినాదాలతో సభా ప్రాంగణం హోరెత్తింది...
వాళ్లలో వెర్రి అభిమానంతో జగనన్న జగనన్న అంటూ వారు వేసే కేకలతో నేషనల్ హైవే మీద సభా ప్రాంగణంలోకి రాలేక సభలో ఎంత మంది అయితే ఉన్నారు సభ ప్రాంగణం వెలుపల ఎమర్జెన్సీ ల్యాండింగ్ సిమెంటు రోడ్డు మీద అంతమంది నిలుచుని జగన్ ప్రసంగాన్ని ఎల్ఈడి స్క్రీన్ లలో వీక్షించారు...
మూడు గంటల 25 నిమిషాలకు రావలసిన జగన్ షెడ్యూల్లో స్వల్ప మార్పుతో మూడు గంటల 45 నిమిషాలు సమయానికి వచ్చారు...
జనాలు రాక సీఎం గంటన్నర ఆలస్యంగా వచ్చాడు అని ఫేక్ ప్రచారానికి కూడా టిడిపి సోషల్ మీడియాలో పాల్పడింది..
ఇంచుమించుగా 15 లక్షల మంది జనాభా వచ్చినట్లు అంచనా వేస్తున్నారు..
ఇలాంటి మభ్య పెట్టే పోస్టులతో..అనుకూల టీవీ ప్రచార మాధ్యమాలలో...సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారాలు చేసినంత మాత్రాన సీఎం జగన్ గ్రాఫ్ తగ్గుతుంది అనుకోవటం వారి భ్రమ అవుతుంది...
ప్రజల మనసులో ఉన్న ఆలోచన ప్రకారమే ఓటు వేస్తారు అనేది తెలుగుదేశం నాయకులు ఎప్పటికీ గ్రహిస్తారో ఏమో...
ఇలాంటి తప్పుడు ప్రచారాల వల్ల టిడిపికే ఎక్కువ నష్టం కలుగుతుంది...
ఎందుకంటే ఈరోజు జరిగిన ప్రోగ్రాం కళ్ళారా చూసిన ఈ ప్రాంత తెలుగుదేశం నాయకులే ఆ జన సందోహాన్ని చూసి బిత్తర పోతున్న పరిస్థితి...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0