రేపు శాంతియుతంగా టీడీడీ పాలనా భవనం మందు ఉద్యోగుల నిరసన కార్యక్రమం
రేపు శాంతియుతంగా టీడీడీ పాలనా భవనం మందు ఉద్యోగుల నిరసన కార్యక్రమం
ఉద్యోగ నిర్వహణ చేస్తున్న టీటీడీ ఉద్యోగి భాస్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడు నరేష్ కుమార్ రాజీనామా చేయవలసిందే అని టిటిడి ఉద్యోగులు డిమాండ్ చేశారు..
మారిన విధివిధానాల ప్రకారం బయోమెట్రిక్ విధానం ద్వారా కాకుండా నేరుగా తనని పంపడానికి నిరాకరించిన భాస్కర్ పై జుగుప్సాకర వ్యాఖ్యలు వెంకన్న సాక్షిగా చేసిన నరేష్ కుమార్ ని పాలక మండలి నుండి తొలగించాలని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు..
రాత్రనకా పగలనకా శ్రీవారి భక్తుల సేవలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులపై చెత్త నా కొడకా లాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని వారు ఆవేదన వ్యక్తం చేశారు..
టీటీడీలోని 6,600 మంది ఉద్యోగులు ఈ విషయమై ఒక త్రాటిపైకి వచ్చారని అనుచిత వ్యాఖ్యలు చేసిన నరేష్ కుమార్ క్షమాపణ చెప్పడంతో పాటు తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు గురువారం ఉదయం తిరుమలలో శాంతియుతంగా నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు టిటిడి పాలక మండలి స్పందించే తీరును బట్టి తమ తరువాతి కార్యాచరణ ఉంటుంది అని స్పష్టం చేశారు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0