విశాఖపట్నం టిడిపి ఎంపీ అభ్యర్థి భరత్ ఏమో అలా...టిడిపి ప్రకటనలో ఏమో ఇలా...
విశాఖపట్నం టిడిపి ఎంపీ అభ్యర్థి భరత్ ఏమో అలా...టిడిపి ప్రకటనలో ఏమో ఇలా...
విశాఖపట్నం అన్ని విధాల రాజధానికి తగ్గ హంగులు కలిగి ఉందని బాలకృష్ణ చిన్న అల్లుడు తెలుగుదేశం విశాఖ ఎంపీ అభ్యర్థి భరత్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు..
ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం పొందుతుంది..
ఇదేంట అని ఇంటర్వ్యూ సారాంశం విని ప్రజలందరూ సందేహ పడుతుంటే... ఈనాడులో నేడు అమరావతి రాజధాని అని ప్రకటన టిడిపి ఇచ్చింది...
అంటే వ్యూహాత్మకంగా విశాఖ పట్టణంలో డ్యామేజ్ లేకుండా ఉండేందుకు భరత్ చేత ఆ విధంగా టిడిపి అధిష్టానం చెప్పించిందా అనే సందేహం కలుగుతుంది..
ఎందుకంటే చాలా స్పష్టంగా సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖ పరిపాలన రాజధాని అని నిన్న జరిగిన సభలలో కూడా ప్రకటించారు..
ఈ నేపథ్యంలో ఇలాంటి భిన్నమైన ప్రకటనలు తెలుగుదేశం పార్టీ నుండి రావడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది...
అందులో స్వయాన బాలకృష్ణ అల్లుడు ఈ విధంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం పై తెలుగుదేశం అధినేత స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది...
ఒకవేళ భరత్ వ్యక్తిగత అభిప్రాయం ఆ ప్రకటన అని అన్నా కూడా అంత కీలకమైన అంశంపై ఆ విధంగా మాట్లాడడం హాస్యాస్పదమే అవుతుంది..
ప్రాంతాలవారీగా వారి మనోభావాలు దెబ్బతినకుండా వ్యూహంలో భాగంగా చేసే ప్రకటనలా కనబడుతుంది..
తెలుగుదేశం పార్టీ, దాని ద్వంద వైఖరి పట్ల ఎన్నికల సమయంలో ప్రజలు ఆలోచిస్తారు అని చెప్పక తప్పదు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0