ఎవరో ఏదో అంటుంటారు పట్టించుకోవాల్సిన అవసరం లేదు క్షమాపణ చెప్పే అంశంపై బి ఆర్ నాయుడు స్పందన
ఎవరో ఏదో అంటుంటారు పట్టించుకోవాల్సిన అవసరం లేదు క్షమాపణ చెప్పే అంశంపై బి ఆర్ నాయుడు స్పందన
ఎవరో ఏదో అంటుంటారు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని స్పందించారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్ నాయుడు..
క్షమాపణలు చెప్తే దానివల్ల తప్పు లేదు కానీ చెప్పినంత మాత్రాన మరణించిన వాళ్లు తిరిగి రాలేరు కదా.. అన్నారు నాయుడు..
ఆ ప్రమాదం ఎలా జరిగింది ఎట్లా జరిగింది ఎంక్వయిరీ చేస్తాం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం.. అన్నారు..
ఈరోజు పిఠాపురం లో జరిగిన సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ క్షతగాత్రులను పరిశీలించినప్పుడు ఒక్కొక్కరి గోడు వింటే హృదయం ద్రవిస్తుందని అన్నారు..
ఊహకే అందని దుర్ఘటన జరిగినా బాధితులు పెద్ద మనసుతో స్పందిస్తున్నారని అన్నారు..
అయితే సరైన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయలేదని వారు వాపోయారు అని తెలిపారు..
సమన్వయ లోపంతో పాటు తప్పు మనలో ఉంచుకొని క్షమాపణ చెప్పము అంటే ఎలా క్షమాపణ చెప్పవలసిందే అన్నారు పవన్ కళ్యాణ్..
నాకు సంబంధం లేకపోయినా ప్రభుత్వంలో భాగస్వామిగా నేను చెప్పలేదా క్షమాపణ అని ప్రశ్నించారు పవన్..
టిటిడి చైర్మన్ బి ఆర్ నాయుడు ఈవో జేఈవో ఇతర అధికారులు క్షమాపణ చెప్పవలసిందే..
అన్న పవన్ కళ్యాణ్ మాటలకు ఉన్నది బి.ఆర్ నాయుడు స్పందించారు..
మరి ఈరోజు జరిగిన కూటమి నాయకుల వ్యాఖ్యల ప్రభావం ఎలా దారితీస్తుందో వేచి చూడాల్సిందే..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0