బెయిల్ మంజూరై బయటికి వచ్చిన అనంతరం లక్ష్మి కీలక వ్యాఖ్యలు..
బెయిల్ మంజూరై బయటికి వచ్చిన అనంతరం లక్ష్మి కీలక వ్యాఖ్యలు..
జైపూర్ కోర్టులో బెయిల్ మంజూరైన తర్వాత కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మి కీలక వ్యాఖ్యలు చేశారు..
తనపై పెట్టిన సైబర్ క్రైమ్ కేసులో ఎలాంటి పాత్ర తనకు లేదని తనను అరెస్ట్ చేసిన 24 గంటల్లోనే పోలీసులు నిర్ధారించడంతో తనకు బెయిల్ వెంటనే దొరికిందని తెలిపారు..
దాదాపు 45 రోజులు బెయిల్ దొరికే అవకాశం లేని కేసులో తనకు ఎలాంటి పాత్ర లేదని ప్రాథమికంగా నిర్ధారణ అయినందునే తనకు కోర్టు బెయిల్ మంజూరు చేసిందని ఆమె తెలిపారు..
తనకు కచ్చితంగా కిరణ్ రాయల్ నుండి ప్రాణాపాయం పంచి ఉందని ఉద్ఘాటించారు..
జైపూర్ నుండి తిరిగి వస్తానని కూడా తనకు నమ్మకం లేదని బెయిల్ మంజూరైన అనంతరం ఆమె వ్యాఖ్యలతో కూడిన వీడియో రిలీజ్ చేశారు..
పవన్ కళ్యాణ్ తనకు న్యాయం చేస్తారని ఆశించానని కానీ ఎలాంటి న్యాయం జరగలేదని కనీస స్పందన కొరవడిందని ఆవేదన వ్యక్తం చేశారు....
ఇక ఆ పార్టీ వారు ఈ పార్టీ వారు వస్తాము మద్దతు ఇస్తాము అని చెప్పారే గాని ఎవరు తనకు మద్దతును ఇవ్వలేదని తెలిపారు..
ఈ సంఘటన జరుగుతున్న ఈ వారం రోజుల సమయంలో తన ఇద్దరు పిల్లలు నలిగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0