లక్షకు మూడు లక్షల నల్లధనం ఇస్తామని మోసగించిన వైనం
లక్షకు మూడు లక్షల నల్లధనం ఇస్తామని మోసగించిన వైనం
లక్షకు మూడు లక్షల రూపాయలు ఇస్తామని నకిలీ కరెన్సీ అందజేత
మేదరమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జనవరి 27న కడప జిల్లాకు చెందిన రామేశ్వర్ రెడ్డికి తాడిపత్రికి చెందిన మాదాసి నరేంద్ర, అద్దంకి పట్నానికి చెందిన సురేష్, ఏసురత్నం లు లక్షకు మూడు లక్షల రూపాయలు నల్లదనం ఇస్తామని రామేశ్వర్ రెడ్డిని నమ్మించారు.మేదరమెట్ల గ్రామం పిలిపించుకొని ఒక బ్యాగులో డమ్మీ నోట్లు కట్టలు పెట్టి, పై వరుసలో ఉన్న కట్టలకు పైన రెండు ఒరిజినల్ 500 రూపాయల నోట్లు పెట్టి రామేశ్వర రెడ్డి వద్ద ఆరు లక్షల రూపాయలు తీసుకొని మొత్తం మీద 5000 రూపాయలు ఒరిజినల్ నోట్లు మిగతావన్నీ డమ్మీ నోట్లు ఉన్న బ్యాగు ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయినారు. బాధితుడు కొంత దూరం వెళ్లిన తర్వాత ఆ డబ్బులు చూసుకొని అవి డమ్మీ నోట్లుగా గుర్తించి ఫిర్యాది ఫిబ్రవరి 14న మేదరమెట్ల పోలీస్ స్టేషన్ వచ్చి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ చీటింగ్ కేసుగా నమోదు చేసి ముద్దాయి అయిన మాదాసి నరేంద్రను అతనికి సహకరించిన సురేష్, ఏసు రత్నములను ఈనెల 15న అరెస్టు చేశారు.. వారి వద్ద ఉన్న 10 డమ్మీ కట్టల 500/- నోట్లు, 40,000/- రూపాయల ఒరిజినల్ 500/- నోట్లు నగదు వారు దొంగతనానికి ఉపయోగించిన కారు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై మహమ్మద్ రఫీ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0