రేపల్లె ప్రాంతంలో కోడి పందేలా జోరు.. లక్షల్లో పందేలు
రేపల్లె ప్రాంతంలో కోడి పందేలా జోరు.. లక్షల్లో పందేలు
సంప్రదాయం ముసుగులో జూదక్రీడలు
పోలీసుల ఆదేశాలు బేఖాతరు
బరితెగించి... కత్తి కట్టి......జోరుగా జూదక్రీడలు
ముఖ్యనేతల అనుచరులే నిర్వాహకులు
రేపల్లె:నియోజక వర్గంలోని తీర ప్రాంత గ్రామాలు జూద క్రీడలకు అడ్డాగా మారాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా అధికారపార్టీకి చెందిన ముఖ్యనేతల అనుచరులు జూద క్రీడలకు తెరతీశారు. సంక్రాంతి పండు గను పురస్కరించుకుని రేపల్లె నియోజకవర్గంలోని చెరుకుపల్లి మండలం తూర్పుపాలెం కోడి పందేలకు వేదికలయ్యాయి. ఒకప్పుడు గోదావరి జిల్లా లకు మాత్రమే పరిమితం అయిన జూద క్రీడలు నేడు పల్లెపల్లెకు వ్యాపించాయి. కోడి పందెల బరుల వద్ద నిర్వాహకులు ప్రత్యేకంగా మూడు ముక్కలాట, మద్యం, లాటరీలు, గుండాట, కోత ముక్క, బ్రాక్కెట్టు వంటి జూదక్రీడలు ఏర్పాటు చేశారు. సంప్రదాయం ముసుగులో రాజకీయ పార్టీ లకు చెందిన నాయకులు కోడి పందేలు జూదక్రీడలు నిర్వహించేందుకు అధికారపార్టీ ముఖ్య నేతల అనుచరులు బహిరంగంగానే బరులను సిద్ధం చేశారు. పోలీసులు, రెవిన్యూ అధికారులు ఎన్ని ఆంక్షలు విధించినా బరితెగించిన నేతలు, పందెం రాయుళ్ళు బరులను సిద్ధంచేసి జూదక్రీడలు ఆడించారు. బరులవద్ద ప్రత్యేక వీఐపీ గ్యాలరీలతో పాటు, రూ.50 వేల నుండి లక్షల వరకు పందేలు నిర్వహించేందుకు ఒక బరి, రూ.50 వేల లోపు పందెలు వేసేవారికి ప్రత్యేక బరులను ఏర్పాటు చేశారు. కోడి పందెల బరుల వద్ద మూడుముక్కలాట మద్యం లాటరీలు, గుండాట, కోత ముక్క, బ్రాక్కెట్టు వంటి జూదాలు జరిపేందుకు జూదరాయుళ్ళ వద్ద నుండి పెద్ద ఎత్తున అడ్వాస్సులు కూడా నిర్వాహకులు తీసుకున్నారు. సుమారు రూ.40లక్షల నుంచి రూ.80లక్షలకు కాంట్రాక్టు అప్పగించారని తెలుస్తోంది. బరుల వద్ద ఏర్పాటు చేసే టూ వీలర్, కార్ పార్కింగ్లకు, రూ.6 లక్షల రూపాయలకు లీజుకిచ్చారు. బరుల వద్ద మద్యం అమ్ముకునేందుకు వేలం పెట్టి రూ.5లక్షలకు పైగా నే పాట నిర్వహించారు. బిర్యాని పాయింట్ ఏర్పాటునకు లక్ష రూపాయలు, శీతల పానీయాలు, గుట్కా, ఖైనీ, సిగ రెట్లు అమ్ముకొనేందుకు లక్ష రూపాయలు నిర్వాహకులు వసూలు చేస్తున్నారు. కోడి పందెం బరులు కూడా రూ.10వేలు, రూ.20వేలు, రూ.50వేలు, రూ.లక్ష, రూ.2లక్షలు తదితర కేటగిరీలుగా ఏర్పాటు చేసి పందాలు నిర్వచించారు.ఏది ఏమైనా నియోజకవర్గంలో జూదక్రీడలు పోలీస్ వర్సెస్ పొలిటికల్గా మారాయి. ఇవికాక ప్రతి గ్రామంలోనూ చిన్న, చిన్న పందెలు జరిగాయి. మరో ప్రక్క కోడి పందెలు, జూద క్రీడలకు అనుమతులు లేవని పోలీసులు ప్రచారం చేసినా...నాయకుల అనుచరులు మాత్రం వెనుకకు తగ్గేది లేదంటూ బరులను ఏర్పాటు చేసి కత్తి కట్టి కోడిపందాలు నిర్వహించారు. సంప్రదాయం పేరుతో.. పోలీస్ ఆదేశాలు బేఖాతరు చేస్తూ జూద క్రీడలు యదేచ్ఛగా నిర్వహించారు. అధికారిక పార్టీ కోడి పందెల బరుల నిర్వాహణకు అన్ని విధాలుగా సహయ సహకారాలు అందిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయా బరుల్లో కేటగిరీకి సంబంధించిన వారు పందాలు కాసుకునే విధంగా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. పోలీసులు మాత్రం గ్రామీణ ప్రాంతాలలో ఒకరిద్దరూ కోడి పందాలు వేసిన వారిని పట్టుకొచ్చి కేసులు నమోదు చేస్తూ తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0