చదలవాడకు కళామిత్ర ప్రతిభా పురస్కారం
చదలవాడకు కళామిత్ర ప్రతిభా పురస్కారం
ఆదివారం ఉదయం స్థానిక ఒంగోలులోని వి.ఐ.పి రోడ్డునందుగల "పద్య సారస్వత పరిషత్"సంస్థ ఆవరణలో ఆ సంస్థ జాతీయ అధ్యక్షులు, ఉత్తమ ప్రధానోపాధ్యాయ అవార్డు గ్రహీత,పద్యభారతి చదలవాడ లక్ష్మీ నరసింహారావును కలిసి వారు చేస్తున్న సాహిత్య సేవకు గుర్తింపుగా వారికి కళామిత్ర ప్రతిభా పురస్కారాన్ని ప్రదానం చేసినట్లు కళామిత్రమండలి (తెలుగు లోగిలి)
జాతీయ సంస్థ అధ్యక్షులు డా.నూనె అంకమ్మరావు ఒక ప్రకటనలో తెలియజేశారు.ఈసందర్భంగా నాగభైరవ సాహిత్య పీఠం అధ్యక్షులు డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ మాట్లాడుతూలక్ష్మీ నరసింహారావు"ప్రబంధ యుగకర్త ఎర్రప్రెగడ"అనే పరిశీలనా గ్రంథంతోపాటు, శ్రీ గిరి వెంకటేశ్వర శతకం,పద్యభారతి ఖండకావ్యాన్ని, తెలుగు జాతీయములు-నానుడులు-పుట్టుపూర్వోత్తరములు, రోజుకో సూక్తి మొదలగు గ్రంథాలను రచించారని అన్నారు. ఆయన సాంప్రదాయ బద్దంగా పద్య కవిత్వం రాయడంలో గొప్ప వారని ,పద్య సాహిత్యం పట్ల వారి సేవలు నిరుపమానమైనవని,అందుకే వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నామని నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం గౌరవాధ్యక్షురాలు శ్రీమతి తేళ్ళ అరుణ పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో శ్రీ కృష్ణదేవరాయ సాహిత్య సాంస్కృతిక సేవా సమితి అధ్యక్షుడు కుర్రా ప్రసాద్ బాబు, నాగినేని నరసింహారావు మెమోరియల్ ఆర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు మిడసల మల్లిఖార్జునరావు, ప్రముఖ కవి యు.వి.రత్నం, నటులు ధేనువకొండ సుబ్బారావు,సాహితీ పోషకులు ఓరుగంటి ప్రసాద్,పి.గోవర్థన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0