ఒంగోలు కొండపి నియోజకవర్గం లలో వివిధ కార్యక్రమాలలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే బాలినేని.. ఒంగోలులో విలేకరుల సమావేశం..
ఒంగోలు కొండపి నియోజకవర్గం లలో వివిధ కార్యక్రమాలలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే బాలినేని.. ఒంగోలులో విలేకరుల సమావేశం..
పాపం బాలినేని శ్రీనివాసరెడ్డి... మరల మరోసారి ఆవేశానికి గురి అయ్యారు... తన రాజకీయ జీవితాన్ని ఫణంగా పెట్టానని వాపోయారు.. తెలుగుదేశం మద్దతు పత్రికలపై రుసరుసలాడారు.. అసత్యాలను ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.. ఇంతకీ విషయం ఏంటంటే పేదలకు ఇళ్ల స్థలాల భూములను పట్టాలు ఇచ్చేందుకు నిధులు రాకుండానే సిద్ధం చేయడం ఏంటని సదరు పత్రిక ప్రస్తావించిందట.. అందున కాంట్రాక్ట్ వర్క్ వేరే ప్రాంతం నుండి వ్యక్తులను పిలిపించి చేస్తున్నారని రాశారట..ఒకవేళ నిధులు రాకపోతే నష్టపోయేది కాంట్రాక్టరే కదా? మీకు బాధ ఏంటి అని బాలినేని ప్రశ్నించారు.. ఇలాంటి పిచ్చి రాతలు రాస్తే సీఎం ఊరుకుంటాడేమో కానీ నేను ఊరుకోను ఆ పత్రిక సంస్థలను ముట్టడిస్తాను అన్నారు బాలినేని...
విచిత్రం ఏమిటంటే సదరు పత్రికలు ముఖ్యంగా వైసిపి టార్గెట్గా రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తాయి అనే విషయం బాలినేనికి తెలియదా.. ఆ పత్రికల నైజమే అది...
అలాంటి మీడియా ముందు నేను జూదం ఆడుతాను.. అది నా వ్యక్తిగత అంశం... నా దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి? నేను తెలుగుదేశం వాళ్ళ దగ్గర అప్పులు తీసుకున్నాను... నా మనసుకు కష్టం అని అనిపిస్తే ఏదీ దాచుకోను అని వివాదాలు తన చుట్టూ అల్లుకునేటట్లు సదరు మీడియా విస్తృత ప్రచారం చేస్తుందని విషయం విస్మరిస్తే ఎలా? అంతేకాదు నేను ఎవరిని లెక్క చేయను ఆ దేవుడినైనా అని పలుమార్లు బాలినేని అన్నటువంటి సందర్భాలు ఉన్నాయి..
సరే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఒంగోలు ఎంపీ స్థానానికి సీఎం జగన్ నిర్ణయించడంతోపాటు కొన్ని నియోజకవర్గాల పరిశీలకుడిగా సీఎం బాధ్యతలు అప్పగించారు...దాంతో మరల ఆయన అలిగినట్లు వార్తలు వచ్చాయి... అయితే ఒకప్పుడు రీజినల్ కోఆర్డినేటర్ బాధ్యతలు నుండి బాలినేని తప్పుకున్నారు కదా..తన ఒక్క నియోజకవర్గంలో దృష్టి కేంద్రీకరిస్తాను అని చెప్పారు కదా...
అలక వచ్చినప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం ప్రెస్ ముందు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సబబేనా అన్న ప్రశ్న వైసీపీ అభిమానులు తలెత్తుతుంది..
మరల తాజాగా తన కుమారుడు ప్రణీత్ రెడ్డికి గిద్దలూరు అసెంబ్లీ టికెట్ ఆశిస్తూ సీఎం అప్పాయింట్మెంట్ కోసం వేచి చూస్తున్నట్లు మరల ఊహాగానాలు... ఇలాంటి ఊహాగానాలను ఆయన ఎప్పటికప్పుడు తీవ్రంగా ఖండించిన పరిస్థితి ఉంటే మరలా మరలా మీడియా రాసేందుకు సాహసం చేయకపోవచ్చు... మరి బాలినేని అలాంటి ఊహగానాలపై స్పష్టత ఇవ్వడంలో ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు?
మరల ఇవాళ అన్యాపదేశంగా సీఎం ప్రస్తావన తేవడం ఇక అందుకు అనుగుణంగా ఇంకా అసంతృప్తి గానే ఉన్న బాలినేని అని తెలుగుదేశం మీడియా బాకాలు ఊదటం సహజమే కదా...
మరి ఇకనైనా బాలినేని ప్రతి విషయానికి ప్రెస్ ముందు ఏదో ఒకటి తన మనసులోని బాధల రూపంలో వెళ్లగకటం మానుకుంటే ఆయనకే మంచి జరుగుతుంది...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0