కొరిసపాడు మండలం రావినూతలలో పలు కార్యక్రమాలలో పాల్గొన్న హనీమిరెడ్డి
కొరిసపాడు మండలం రావినూతలలో పలు కార్యక్రమాలలో పాల్గొన్న హనీమిరెడ్డి
అద్దంకి నియోజకవర్గం కొరిసపాడు మండలం రావినూతలలో అద్దంకి నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్ హనీమిరెడ్డి ఆదివారం రాత్రి పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు...
రావినూతల సచివాలయ నూతన భవనాన్ని ప్రారంభించారు...
రజక కాలనీ సిమెంటు రోడ్డు నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం చేశారు... రావినూతల సొసైటీ నూతన చైర్ పర్సన్ గా కారుసాల బసవేశ్వర రావు ప్రమాణ స్వీకార సభలో పాల్గొని ప్రసంగించారు...
ఈ సందర్భంగా హానిమీ రెడ్డి మాట్లాడుతూ, సమాజంలోని పేద ప్రజల సంక్షేమాన్ని ఎల్లవేళలా అమలు చేసేందుకు జగనన్న ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.. వైయస్సార్సీపి ప్రభుత్వంలో దాదాపు ప్రతి ఇంటికి అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందాయని అన్నారు.. నాడు నేడు కార్యక్రమం కింద పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు ప్రభుత్వం తెచ్చిందని అన్నారు. వైద్య రంగంలో చేపట్టిన సంస్కరణల వల్ల అందరికీ సరైన వైద్యం నేడు అందుతుందని తెలిపారు... ప్రజలు అప్రమత్తులై దుష్ప్రచారాలను నమ్మకుండా పేదల పక్షపాతి అయిన జగనన్న ప్రభుత్వం మరల వచ్చేందుకు వైసిపి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు
చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి మాట్లాడుతూ తనకు ఈ నియోజకవర్గంలో రావినూతలలో అవినాభావ సంబంధం ఉందని పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.. సహకార రంగంలో వివిధ స్థాయిలో పనిచేసే అనుభవజ్ఞుడైన కారసాల బసవేశ్వర రావు సొసైటీ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించటం సొసైటీ అభివృద్ధికి తోడ్పడుతుందని బలరాం తెలిపారు..
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చాట్ల విజయ వీణ ఎంపిటిసి 1 కారుసాల లక్ష్మి శ్రీనివాస్ వైజాగ్ సుబ్బారావు పలువురు వైసీపీ నాయకులు అధికారులు పాల్గొన్నారు..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0