మున్ముందు రసవత్తరంగా అద్దంకి రాజకీయాలు
మున్ముందు రసవత్తరంగా అద్దంకి రాజకీయాలు
అద్దంకి నియోజకవర్గంలో రాజకీయాలు రసకందాయంలో పడనున్నాయి అనడానికి నిదర్శనంగా మొన్న టిడిపిలో చేరిన వైసీపీ కార్పొరేటర్లు మరల సొంతగూటికి వచ్చారు...
ఈరోజు అద్దంకి నియోజకవర్గ వైసిపి నాయకుడు వైవిభద్రారెడ్డి ఆధ్వర్యంలో అద్దంకి మునిసిపాలిటీ వైస్ చైర్మన్... ఐదవ వార్డు కార్పొరేటర్ దేసు పద్మేష్.. వైసిపి లో పునః ప్రవేశం చేశారు..
ఇక ముందు ఎలాంటి ప్రలోభాలకు లొంగే ప్రసక్తే లేదని పద్మేష్ ఈ సందర్భంగా సందర్భంగా తెలిపారు... ప్రజలకు అనేక సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తున్న జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసిపి ప్రభుత్వం తిరిగి రావడం ఖాయమని అన్నారు...
అందుకే ఆలోచించుకొని తిరిగి సొంత గూటిలోకి వచ్చానని తెలిపారు...
నిన్న 8వ వార్డు కౌన్సిలర్ కూడా తను వైసిపి పార్టీలోనే కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు..
ఇప్పుడే ఇలా ఉంటే రానున్న 50 రోజుల కాలంలో ఎత్తులకు పైఎత్తులతో మరింత రసకందాయంలో అద్దంకి రాజకీయాలు ఉంటాయని పరిశీలకుల భావిస్తున్నారు
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0