16న వైఎస్ఆర్సిపి అభ్యర్థుల తుది జాబితా మేనిఫెస్టో విడుదల
16న వైఎస్ఆర్సిపి అభ్యర్థుల తుది జాబితా మేనిఫెస్టో విడుదల
వైయస్సార్ సిపి అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి ఈనెల 16న ఎన్నికల సమర శంఖారావం పూరించనున్నారు... ఇడుపులపాయ లో వైయస్సార్ ఘాట్ సందర్శించి దివంగత మహానేతకు నివాళులు అర్పించి అనంతరం అభ్యర్థుల తుది జాబితా మేనిఫెస్టో ప్రకటించనున్నట్లు సమాచారం...
2019 ఎన్నికల్లో కూడా జగన్ మోహన్ రెడ్డి ఇడుపులపాయలోనే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు..
ఇడుపులపాయలో ప్రకటనల అనంతరం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుండి ఎన్నికల పర్యటనను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.. నెల రోజులు ప్రతి జిల్లాలో మూడు నియోజకవర్గాలు కవర్ అయ్యేట్లుగా ఎన్నికల ప్రచార సభలు..రోడ్డు షో లు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధమైంది...
ఇప్పటికే సిద్ధం సభల ద్వారా కార్యకర్తలకు అభిమానులకు ప్రజలకు దిశా నిర్దేశం చేసిన ముఖ్యమంత్రి ఇక జిల్లాల పర్యటన ద్వారా ప్రజలకు మరింత చేరువై రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయ దుందుభి మోగించేందుకు అవసరమైన కసరత్తులు చేస్తున్నారు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0