జోగి దేవినేని లపై వచ్చే నెల 4వ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు.. సుప్రీం కోర్ట్.. తలశిల రఘురాం లేళ్ల అప్పిరెడ్డి గవాస్కర్ లకు కూడా ఊరట
జోగి దేవినేని లపై వచ్చే నెల 4వ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు.. సుప్రీం కోర్ట్.. తలశిల రఘురాం లేళ్ల అప్పిరెడ్డి గవాస్కర్ లకు కూడా ఊరట
వైసిపి నేతలు దేవినేని అవినాష్, జోగి రమేష్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.. టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్, జోగి రమేష్లపై వచ్చే నెల నాలుగో తేది వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది.. కాగా టిడిపి కార్యాలయం దాడి కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందస్తు బెయిల్ ను నిరాకరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు వైసీపీ నేత దేవినేని అవినాష్, మాజీ మంత్రి జోగి రమేష్.. వారి పిటిషన్పై నేడు విచారణ జరిపిన సుప్రీంకోర్టు దేవినేని అవినాష్, జోగి రమేష్ లకు రక్షణ కల్పించాలని సూచించింది.. మరోవైపు.. ఈ కేసు విచారణకు దేవినేని అవినాష్, జోగి రమేష్ సహకరించాలని పేర్కొంది..
ఇదే సమయంలో దేవినేని అవినాష్, జోగి రమేష్ తమ పాస్పోర్ట్ను హ్యాండోవర్ చేయాలని స్పష్టం చేసింది.. ఇక , వైసీపీ నేతల తరఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు కపిల్ సిబాల్.. ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహిత్గి , సిద్ధార్థ లూత్రా తమ వాదనలను సుప్రీంకోర్టులో వినిపించారు.. దేవినేని అవినాష్, జోగి రమేష్తో పాటు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, గవాస్కర్ లకు మధ్యంతర రక్షణ కల్పించాలని సూచించింది సుప్రీంకోర్టు.. కాగా ముందస్తు బెయిల్ పై విచారణ వచ్చే నెల నాలుగో తేదిన చేపడతామని సుప్రీం కోర్టు తెలిపింది..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0