తాను వైసీపీలోనే కొనసాగనున్నట్లు సీఎం జగన్ ని కలిసి స్పష్టం చేసిన మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు
తాను వైసీపీలోనే కొనసాగనున్నట్లు సీఎం జగన్ ని కలిసి స్పష్టం చేసిన మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు
మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు ఎట్టకేలకు వైసీపీలోనే కొనసాగాలని నిర్ణయానికి వచ్చారు..
ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి సీఎంని కలిసి తాను వైసీపీలో అనే కొనసాగుతానని స్పష్టం చేశారు..
అయితే పూర్వపరాలలోకి వెళ్తే తెలుగుదేశంలో మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన సిద్ధా రాఘవరావు...
2019లో వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీలో చేరారు..
సీఎం జగన్ కొన్ని నెలల క్రితం భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ అయిన తర్వాత రాఘవరావు కుమారుడు సుధీర్ కు టీటీడీ బోర్డు మెంబర్ గా అవకాశం ఇచ్చారు..
అదేవిధంగా సిద్ధా రాఘవరావు ని అద్దంకి నుండి లేదా ఒంగోలు నుండి లేదా గిద్దలూరు నుండి పోటి చేయమని సీఎం జగన్మోహన్ రెడ్డి కోరినట్లు పెద్ద ప్రచారమే జరిగింది..
అయితే ఆయన ఆయా స్థానాల్లో పోటీ చేసేందుకు సుముఖత చూపలేదు..
తను 2014లో పోటీ చేసి గెలిచిన దర్శి నియోజకవర్గం నుండి టికెట్ను ఆశించారు..
అయితే అప్పటికే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి దర్శి టికెట్ హామీ ఇచ్చినందున సీఎం జగన్ దర్శి అవకాశాన్ని రాఘవరావుకి కల్పించలేదు...
ఈ నేపథ్యంలో తెలుగుదేశం నుండి కూడా దర్శి నుండి పోటీ చేసేందుకు సిద్ధాను ఆహ్వానించినట్లు సమాచారం..
తన మాతృ సంస్థ అయిన తెలుగుదేశం పార్టీలో వెళ్లేందుకు ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత సిద్ధా రాఘవరావు ఆసక్తి చూపుతున్నారు అనేది ఆయన వర్గం నుండి వచ్చిన సమాచారం..
అయితే ఆయన కుమారుడు సుధీర్ మాత్రం అందుకు వ్యతిరేకించినట్లు.. ఆయన వర్గంలోని పలువురు టిడిపిలో చేరకుండా ఉండటమే శ్రేయస్కరం అని సూచించినట్లు తెలిసింది..
అసలు 2019లో సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న సిద్ధా రాఘవరావు కి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు దర్శి టికెట్ తిరిగి ఇవ్వకుండా ఒంగోలు ఎంపీగా పోటీ చేయించారు..
తనకి ఇష్టం లేకపోయినా ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు సిద్ధా రాఘవరావు..
వాస్తవంగా ఆ విధంగా టిడిపి అధినేత ఆయనకు ఒక విధంగా అన్యాయం చేసినట్లు అయింది..
కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధ రాఘవరావు కి మంచి గుర్తింపు ఇచ్చినప్పటికీ ఒకెంత మాతృ సంస్థ మీద మమకారం పోనీ సిద్ధ రాఘవరావు మరలా ఎట్టకేలకు వైసీపీలోనే కొనసాగేందుకు నిర్ణయించుకున్నారు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0