విజయవాడ రిటైనింగ్ వాల్.. వాస్తవాలు..
విజయవాడ రిటైనింగ్ వాల్.. వాస్తవాలు..
విజయవాడ రిటైనింగ్ వాల్ పై ఎవరి వాదనలు ఏంటి అని పరిశీలిస్తే 2009లో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి లంక వాసుల కష్టాలను శాశ్వతంగా తొలగించాలని ఉద్దేశంతో రిటైనింగ్ వాల్ 5.6 కిలోమీటర్ల పొడవు నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారు చేశారు...
తరువాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విజ్ఞప్తి మేరకు కేవలం 1.2 కిలోమీటర్ల మేరకు 2015 లో రిటైనింగ్ వాల్ నిర్మాణం ప్రారంభమై పూర్తి అయింది..
చంద్రబాబు హయాంలో జరిగిన రిటైనింగ్ వాల్ నిర్మాణం లోప భూయిష్టంగా ఉండడంతో సదరు వాల్ కి లీకేజెస్ ఏర్పడి ముంపు నీరు ఆయా ప్రాంతంలో ప్రవహిస్తుందని వార్తలు కొన్ని డిజిటల్ చానల్స్ ప్రసారం చేశాయి..
దివంగత వైయస్సార్ తనయుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో 125 కోట్లతో పటిష్టంగా నిర్మించిన కృష్ణలంక ప్రాంతంలోని రిటైనింగ్ వాల్ నేడు లక్షల మంది ప్రాణాలను కాపాడింది అనడంలో ఎలాంటి సందేహం లేదని విశ్లేషకులు ప్రజలు అభిప్రాయపడుతున్నారు..
అసలు ఈ వాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు చేసింది అప్పటి ముఖ్యమంత్రి వైయస్సార్ అనే విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని అర్థమవుతుంది...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0