పామర్రు లో జగన్ పై విరుచుకుపడ్డ చంద్రబాబు
పామర్రు లో జగన్ పై విరుచుకుపడ్డ చంద్రబాబు
కృష్ణా జిల్లా పామర్రు లో చంద్రబాబు:-
వైసీపీ పాలనలో నిరుద్యోగం పెరిగిపోయిందని అన్నారు. దాంతో.. ఉద్యోగాలు లేక యువత ఇతర ప్రాంతాలకు వలస పోవాల్సిన పరిస్థితులు వచ్చాయని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో సీఎం జగన్ పాలనలో ఏ వర్గ ప్రజలు కూడా సంతోషంగా లేరని అన్నారు. సీఎం జగన్ ప్రభుత్వంలో ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా అని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించారా? డీఎస్సీ వేశారా? అని నిలదీశారు.
ఏటా 4 లక్షల ఉద్యోగాల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తనది అన్నారు. వర్క్ ఫ్రమ్ హోం కూడా తీసుకొస్తామని అన్నారు. జాబు కావాలంటే బాబు రావాలని.. బాబు పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని చంద్రబాబు అన్నారు. అలాగే.. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడమే తన చిరకాల కోరిక అన్నారు. సీఎం జగన్ తన కేబినెట్లోకి బూతులు మాట్లాడే వారినే తీసుకున్నారనీ చంద్రబాబు అన్నారు.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0