సోమవారం రంగ రంగ వైభవంగా అద్దంకి సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్లు
సోమవారం రంగ రంగ వైభవంగా అద్దంకి సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్లు
ఉమ్మడి ప్రకాశం జిల్లా లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సింగరకొండ లో సింగరకొండ క్షేత్రాధిపతి గా శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారు భక్తుల కొంగు బంగారం గా విరాజిల్లుతూ భక్తులకు కోర్కెలను తీర్చుతూ క్షేత్ర పాలకుడిగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వార్ల 69వ వార్షిక తిరుణాల మహోత్సవం కార్యక్రమం ను నేడు శనివారం నుండి సోమవారం వరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈ ఓ టి సుభద్ర శుక్రవారం తెలిపారు...
నేడు మొదటి రోజు శనివారం సింగర కొండ తిరుణాళ్ళ సందర్భంగా ఉదయం 8. 30 గంటలకు గణపతి పూజ పుణ్యాహవాచన అఖండ దీప స్థాపన మండపారాధన అనంతరం 9.00 గంటలకు ధ్వజస్తంభ నిర్మాణ దాత మేదరమెట్ల శంకర్ రెడ్డి గారిచే జీవద్వజ పూజ ఉష్ణ పతాక పూజ ధ్వజారాహన కార్యక్రమాలను అత్యంత వైభవంగా జరుగుతుందని,సాయంత్రం కోలాట ప్రదర్శన అనంతరం లక్ష్మీ తిరుపతమ్మ వారిచే మహిరావణ చరిత్ర నాటక ప్రదర్శన, సాయంత్రం 7.00 గంటలకు గజ వాహన సేవ ఉంటుందని తెలిపారు.
2 వ రోజు ఆదివారం ఉదయం 5.00 గంటలకు సుప్రభాత సేవ 5.30 గంటలకు బింద తీర్థం 6.00 గంటల నుండి స్వామివారికి విశేష అభిషేకం నిర్వహించి,అనంతరం స్వామి వారి చెంతన రుత్వికులచే మహాన్యాస, పూర్వక ఏకాదశ మన్యుసూక్త వారాభిషేక మరియు సుందరకాండ పారాయణ సూర్య నమస్కారాలు సప్తశతి పారాయణ పంచామృతములు దశవిధ ద్రవ్యములచే విశేష అభిషేకము తదుపరి విశేష అలంకరణ దర్శనం తీర్థప్రసాదాలు వినియోగం జరుగుతుందని తెలిపారు. సాయంత్రం 7.00 గంటలకు దాతలు డిఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ధర్మపత్ని రాధ సహకారంతో ఉష్ణ వాహన సేవ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
తిరునాళ్ళ లోని ముఖ్యమైన ఘట్టం సోమవారం తిరణాల మహోత్సవ సందర్భంగా ఉదయం 4.30 గంటలకు సుప్రభాత సేవ 4.45 గంటలకు బిందెతీర్థం 5.00 గంటల నుండి ప్రాతః కాల ఆర్చన అనంతరం 5.30 గంటల మరుసటి రోజు మంగళవారం మధ్యాహ్నం 1.00 గంట వరకు స్వామి వారి దివ్య దర్శనం నిర్వి రామముగా జరుగుతుందని తెలిపారు. సాయంత్రం 7.00 గంటలకు స్వామివారి రథోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈ ఓ టి సుభద్ర తెలిపారు.
ఈ ఓ సుభద్ర మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలోనే అత్యంత మహిమాన్విత క్షేత్రముగా సింగరకొండ విరాజిల్లుచున్నదని, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారు కొండ కోనలతో ప్రకృతి రమణీయతతో అలరారుతూ పవిత్ర భవనాసి తటాకం ఒడ్డున దక్షిణాభిముఖుడై స్వయంభుగా వెలసి ఉన్నారు.ఈ దేవస్థానము చరిత్ర కు సంబంధించి అనేక గాథలు ప్రచారంలో ఉన్నవి. సుమారు 150 సంవత్సరముల క్రితం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్రాంగణంలో ధ్వజ స్తంభం ప్రతిష్ట జరుగు చుండగా తేజో సంపన్నుడైన ఒక యోగీశ్వరుడు కొండ దిగువన భవనాసి తటాకం ఒడ్డున శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహం ను పూజించి అదృశ్యమైనారు. ఆ అద్భుతాన్ని కొండపై నుండి చూసిన వేలాది భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించికొని పూజించారు. అప్పటి నుండి సింగరకొండలో వెలసిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం దివ్య భవ్య క్షేత్రమై విరాజిల్లుతూ శ్రీ స్వామి వారు పిలిచిన పలికే దైవముగా భక్తుల పాలిట కలపవృక్షముగా భక్తుల మనోభీష్టములు నెరవేరుస్తూ భక్తులచే విశేషంగా పూజలు అందుకొనుచున్నారు. ఈ సింగరకొండ క్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు క్షేత్రాధిపతిగా, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారు క్షేత్రపాలకుడిగా పూజలందుకుంటూ ఉభయ దేవతాక్షేత్రముగా విరాజిల్లుచున్నది. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారు ప్రతినిత్యం అభిషేక త్రిలాకార్చనలు నిత్య కైంకర్యములు పొందుతూ ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రముగా అభివృద్ధి చెందినది.గత 68 సంవత్సరముల నుండి శ్రీ లక్ష్మీనరసింహస్వామి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి తిరుణాల మహోత్సవము మరియు హనుమాన్ జయంతి హనుమాన్ వ్రతము ప్రతి మాసంలో విశేష పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ తిరునాళ్ళ మహోత్సవ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు,కృష్ణా,ప్రకాశం,కర్నూలు,నెల్లూరు జిల్లా ల నుండి భక్తులు లక్షల్లో పాల్గొని స్వామి వార్లని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.ప్రతి సంవత్సరం లాగానే భక్తులకు తిరునాళ్ళ మహోత్సవ కార్యక్రమం లో భక్తులు ఎలాంటి అసౌకర్యాలు కలుగ కుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0