ఈదుమూడి గ్రామంలో సేవా కార్యక్రమాలు చేస్తూ రైతుగా జీవనం సాగిస్తున్న....పూర్ణచందర్రావు
ఈదుమూడి గ్రామంలో సేవా కార్యక్రమాలు చేస్తూ రైతుగా జీవనం సాగిస్తున్న....పూర్ణచందర్రావు
విశాఖ డ్రగ్స్ కేసులో కూనం వీరభద్ర రావు.. కోటయ్యలను సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం..
ఇదిలా ఉండగా వీరభద్ర రావు సోదరులు పూర్ణచంద్రరావు సాక్షి టీవీ లైవ్ షోలో తన వివరణ ఇచ్చారు..
విజయసాయిరెడ్డి తో కలిసిన ఆయన ఫోటో టిడిపి తన సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తూ వైసీపీ ప్రభుత్వానికి ఈ రాకెట్ అంటకట్టే ప్రయత్నం చేసింది..
ఈ నేపథ్యంలో పూర్ణచంద్రరావు వివరణ ఆయన మాటల్లో :-
40 సంవత్సరాల నుండి ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఈదుముడి గ్రామంలో నివసిస్తూ రైతుగా జీవిస్తున్నాను..
నా సోదరుడు వీరభద్ర రావు తదితరులు వ్యాపారాలు నిమిత్తం ఈ గ్రామం విడిచి వెళ్లిపోయారు..
ముందు కాంగ్రెస్ పార్టీలో తర్వాత వైఎస్సార్సీపీ పార్టీలో క్రియాశీలకంగా నేను పని చేస్తున్నాను..
స్థానిక ఎమ్మెల్యేతో కలిసి తాడేపల్లిలో విజయసాయిరెడ్డిని కలిసినప్పుడు దిగిన ఫోటో అది..
అంతకుమించి నాకు ఎలాంటి సంబంధాలు విజయ సాయి రెడ్డి తో లేవు..
ఒకే కుటుంబంలో జన్మించిన రక్తసంబంధీకులు వివిధ వృత్తులలో.. వ్యాపారాలలో.. పార్టీలలో ఉండవచ్చు..
నా సోదరుడు వ్యాపార లావాదేవీలతో నాకు ఎలాంటి సంబంధం లేదు..
అంటూ స్పష్టమైన వివరణ ఇచ్చారు పూర్ణచంద్రరావు..
వాస్తవాలను పరిశీలిస్తే ఈరోజు ఈనాడు దినపత్రికలో కూడా డ్రగ్స్ రాకెట్ వ్యవహారం అనుమానాస్పదంగా ఉందని రాస్తూ, సంధ్య ఆక్వా టెక్ పేరు.. వీరభద్ర రావు.. కోటయ్య చౌదరిల పేర్లు రాయకుండా ఈనాడు దాటవేసింది...
నిన్నటి ఈనాడు పత్రికలో వైసీపీ నాయకులు కార్యకర్తలు వెళ్లి సిబిఐ అధికారులను అడ్డగించారు అని తప్పుడు కథనాలు రాసింది..
కానీ సిబిఐ తన ఎఫ్ ఐ ఆర్ లో కొందరు పోర్ట్ అధికారులు స్థానిక పోలీస్ అధికారులు రావడంతో విచారణ జాప్యం జరిగిందని మాత్రమే పేర్కొన్నారు..ఈ విషయమై విశాఖ పోలీస్ కమిషనర్ స్పష్టమైన వివరణ ఇస్తూ కస్టమ్స్ అధికారులు పిలిస్తేనే తాము వెళ్లినట్లు అయితే తమ అవసరం లేదని సిబిఐ చెప్పడంతో తిరిగి రావడం జరిగిందని స్పష్టం చేశారు...
ఇదిలా ఉండగా 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కి వీరభద్ర రావు తదితరులు పార్టీ ఫండ్ ఇచ్చినట్లు ఆధారాలు చూపిస్తూ వైసిపి తన సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు..
అదేవిధంగా వీరభద్ర రావు కి ఆలపాటి రాజా తో ఉన్న సంబంధాలను కూడా స్పష్టమైన ఆధారాలు చూపిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంది..
కానీ తెలుగుదేశం సోషల్ మీడియా మాత్రం నేరుగా ముఖ్యమంత్రి జగన్ కి వైసిపి ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చంద్రబాబు నాయుడు లోకేష్ ఆధ్వర్యంలో ప్రయత్నం చేస్తుంది..
ఇలాంటి తప్పుడు ప్రచారాల వల్ల దర్యాప్తు కుంటూ పడే ప్రమాదం ఉందని సిబిఐ...అందునా కేంద్ర ప్రభుత్వ పరిశోధన సంస్థ నిజాలు నిగ్గు తేల్చేంతవరకు తెలుగుదేశం... వైసిపి ఇతర పార్టీలు సంయమనం పాటించవలసిన అవసరం ఎంతైనా ఉందని మేధావులు అభిప్రాయపడుతున్నారు
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0