కడప బరిలో ఎవరు నిలవనున్నారు విపక్షాల తరఫున
కడప బరిలో ఎవరు నిలవనున్నారు విపక్షాల తరఫున
కడప పార్లమెంట్ బరిలో వైయస్ అవినాష్ రెడ్డి ని వైసీపీ అభ్యర్థిగా సీఎం జగన్ ప్రకటించగా అటు కాంగ్రెస్ తరపున.. ఇటు టిడిపి తరఫున ఎవరు నిలబడతారు అనేది ఆసక్తిగా మారింది..
కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి తాను కడప ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి కనబరచడం లేదు అనేది సమాచారం..
ఈ నేపథ్యంలో వివేకానంద రెడ్డి భార్య వైఎస్ సౌభాగ్యమ్మని కడప బరిలో నిలపాలని తెలుగుదేశం ప్రయత్నం చేసినప్పటికీ అందుకు వైయస్ షర్మిల అంగీకరించినట్లు సమాచారం..
తన కాంగ్రెస్లో ఉండగా టిడిపి తరఫున నిలబడితే తప్పుడు సంకేతాలు వెలువడతాయి అనే భావనలో షర్మిల సౌభాగ్యంను కడప బరిలో టిడిపి తరఫున నిలబడవద్దని.. పోటీలో నిలబడాలి అనే ఆసక్తి ఉంటే కాంగ్రెస్ తరపున నిలబడితే బాగుంటుందని ని సూచించిన మేర ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి అన్వేషణలో పడింది..
విశాఖపట్నం నుండి వైఎస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయించాలని అధిష్టానం ఆశించినప్పటికీ...ప్రస్తుతం అక్కడ నుండి కాకుండా సునీత సౌభాగ్యంల కుటుంబాలు.. షర్మిల వ్యక్తిగత పరిచయాలు తోడై కడప నుండి షర్మిల పోటీ చేస్తే బాగుంటుందనే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలిసింది..
అయితే షర్మిల తాను శాసనసభ బరిలో ఉంటానని చెబుతూ ఉన్నప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం వైఎస్ షర్మిలను కడప నుండి నిలబెట్టాలి అనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది..
మరి ఎవరు కాంగ్రెస్ అభ్యర్థి... ఎవరు తెలుగుదేశం అభ్యర్థి కడప పార్లమెంటు నుండి అవుతారనేది తెలుసుకోవడానికి రెండు రోజులు పట్టే అవకాశం ఉంది...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0