మైలవరం వైసిపి ఇన్చార్జిగా ముద్రబోయిన వెంకటేశ్వరరావు కి అవకాశం
మైలవరం వైసిపి ఇన్చార్జిగా ముద్రబోయిన వెంకటేశ్వరరావు కి అవకాశం
అటు ఇటు వలసలతో కీలక పరిణామాలు తెలుగుదేశం.... వైసిపి పార్టీలలో చోటు చేసుకుంటున్నాయి...
తాజాగా ముద్రబోయిన వెంకటేశ్వరరావుకి నూజివీడు తెలుగుదేశం పార్టీ టికెట్ రాకపోవడంతో తెలుగుదేశాన్ని వీడి వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు..
ఈ నేపథ్యంలో ప్రస్తుతం నూజివీడు సిట్టింగ్ ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్ కుమార్ కు సీఎంఓ నుండి కబురు వచ్చింది...
ముద్రబోయిన వెంకటేశ్వరరావు అంశాన్ని ప్రతాప్ కుమార్ తో చర్చించడంతోపాటు ముద్రబోయినను మైలవరం పంపితే ఎలా ఉంటుంది అనే ఆలోచన వైసిపి అధికారం చేస్తున్నట్లు సమాచారం..
ముద్రబోయిన వెంకటేశ్వరరావు సోమవారం వైవి సుబ్బారెడ్డి తో చర్చలు జరిపారు...
అయితే ఇప్పటికే తిరుపతిరావు యాదవ్ ను మైలవరం ఇన్చార్జిగా సీఎం జగన్ ప్రకటించడం జరిగింది...
ఆయనకు కూడా సీఎంఓ నుండి పిలుపు వచ్చింది..
అందరితో చర్చించి ముద్రబోయిన వెంకటేశ్వరరావు ను మైలవరం ఇన్చార్జిగా ప్రకటించాలని యోచన సీఎం జగన్ చేస్తున్నట్లు సమాచారం..
ముద్రబోయిన వెంకటేశ్వరరావు ని ఇన్చార్జిగా నియమిస్తే ఎలా ఉంటుందో ఇప్పటికే మైలవరం నేతలకు ఐపాక్ టీం సంప్రదింపులు చేస్తుంది...
ఈ నేపథ్యంలో దాదాపుగా తిరుపతిరావు యాదవ్ కి ఏదో ఒక హామీ ఇచ్చి సీనియర్ అనుభవజ్ఞుడైన యాదవ సామాజిక వర్గానికి చెందిన ముద్రబోయిన వెంకటేశ్వరరావును దాదాపుగా మైలవరం ఇన్చార్జిగా నిర్ణయించటం ఖరారైనట్లు సమాచారం
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0