బాపట్ల ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో పండంటి బిడ్డను ప్రసవించిన మునిసిపల్ కమిషనర్ సతీమణి
బాపట్ల ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో పండంటి బిడ్డను ప్రసవించిన మునిసిపల్ కమిషనర్ సతీమణి
బాపట్ల ఏరియా ప్రభుత్వ వైద్యశాలలో పండంటి బిడ్డను ప్రసవించిన బాపట్ల మునిసిపల్ కమిషనర్ సతీమణి
బాపట్ల:
పురపాలక సంఘం కమిషనర్ శ్రీకాంత్ ఆదర్శవంతంగా నిలిచారు..
తన భార్యకు స్థానిక ఏరియా వైద్యశాలలో కాన్పు చేయించారు.కనీస పేదవాడు కూడా ప్రభుత్వ వైద్యశాలలో కాన్పు చేయించడానికి ఇష్టపడని ఈ రోజులలో బాపట్ల మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ భార్య గర్భవతి కావడంతో ప్రభుత్వ వైద్యశాలలో వైద్యురాలు విజయలక్ష్మి ద్వారా కాన్పు చేయించారు.
పండంటి ఆడబిడ్డకు కమిషనర్ శ్రీకాంత్ బార్య జన్మనిచ్చారు.సహజంగా ప్రభుత్వ ఉద్యోగం చేసే చిన్నపాటి ఉద్యోగి కూడా తన భార్యను ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్న ఈ రోజులలో మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ సాధారణ వ్యక్తిల ప్రభుత్వ వైద్యశాలలో కాన్పు చేయించి ఆదర్శ అధికారిగా పేరు పొందారు.
ఇప్పటికే బాపట్ల జిల్లాలోనే లంచాలకు తావు లేకుండా మున్సిపల్ కమిషనర్ గా పని చేస్తున్న ఏకైక సిన్సియర్ అధికారిగా ఆయన పేరు పొందారు. ఇటువంటి నేపథ్యంలో సాధారణ ప్రభుత్వ వైద్యశాలలో ఆయన భార్యకు కాన్పు చేయించడంతో శభాష్ శ్రీకాంత్ అంటూ పలువురు వైద్యులతో పాటు,ఉద్యోగులు ఆయన్ని అభినందిస్తున్నారు...
చిన్నాచితకా రోగాలకు కార్పొరేట్ వైద్యశాలలకు పరుగులెడుతున్న ఈ కాలంలో ప్రభుత్వ ఉన్నత అధికారి అయి ఆదర్శవంతమైన చక్కటి నిర్ణయం ఆయన తీసుకోవడం అభినందనీయం..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0