రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి దే అధికారం..వికసితాంధ్రప్రదేశ్ కు కృషి చేద్దాం..ప్రధాని నరేంద్ర మోడీ
రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి దే అధికారం..వికసితాంధ్రప్రదేశ్ కు కృషి చేద్దాం..ప్రధాని నరేంద్ర మోడీ
నా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలారా.. రాజమహేంద్ర వాసులారా.. అందరికీ ప్రణామం..
గోదావరి తల్లికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా..
ఆదికవి నన్నయ పుట్టిన నేల ఇది అని తెలుగులో ప్రధాని మోడీ రాజమండ్రిలో జరిగిన కూటమి ఎన్నికల ప్రచార సభలో తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు..
ముఖ్యమంత్రి జగన్ ప్రస్తావించకుండా వైసిపి ప్రభుత్వం పై విమర్శలు సంధించారు..
ఆయన ప్రసంగంలోని ముఖ్య అంశాలు:
మే 13 అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న రోజు..
చైతన్యవంతులైన మీరు ఎన్డీఏ భాగస్వామ్య ప్రభుత్వాన్ని ఆరోజు ఎన్నుకోబోతున్నారు...
తద్వారా వికసిత్ ఆంధ్ర ప్రదేశ్ చూడబోతున్నారు..
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందే చేతులు ఎత్తేసింది..
ఈ ఐదు సంవత్సరాల కాలంలో వైయస్సార్సీపి విధానాలతో విసిగిపోయిన ప్రజలు ఆ పార్టీని 13వ తేదీ తిరస్కరించబోతున్నారు..
మూడు రాజధానుల పేరుతో వైసిపి ప్రభుత్వం నాటకానికి తెరతీసింది..
రాజధానుల పేర పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడాలని వైసిపి ప్రయత్నించింది..
చివరికి ఒక్క రాజధాని కూడా కట్టలేకపోయింది... పోలవరం నిర్మాణానికి...రైతాంగ ప్రయోజన కోసం 15 వేల కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం అందించాం.. పోలవరం మూల పడింది...
అవినీతితో రాష్ట్ర ప్రభుత్వం కూరుకుపోయింది.. ఇసుక మాఫియా లిక్కర్ సిండికేట్ గా ఆంధ్రప్రదేశ్ మారిపోయింది..
మే 13న ఎన్ డిఎ కూటమిని రాష్ట్రంలో గెలిపించడం ద్వారా వికసిత్ ఆంధ్ర ప్రదేశ్... వికసిత్ భారత్ నిర్మాణానికై డబల్ ఇంజిన్ సర్కార్ను మీరు ఎన్నుకోవాలి అని పిలుపునిచ్చారు..
ప్రధాని సభలో పవన్ కళ్యాణ్ , నారా లోకేష్, పురందేశ్వరి,సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0