అద్దంకి వైసిపి అభ్యర్థి హనీమిరెడ్డి పై టిడిపి అనుకూల మీడియా అవాకులు చవాకులు
అద్దంకి వైసిపి అభ్యర్థి హనీమిరెడ్డి పై టిడిపి అనుకూల మీడియా అవాకులు చవాకులు
అందరూ ఏప్రిల్ లో ఎన్నికలు జరుగుతాయి అని అని భావించగా ఆంధ్రప్రదేశ్లో మే 13వ తేదీకి ఎన్నికలు వచ్చాయి...
అయితే ఎన్నికల ఓటింగ్ సమయం చాలా సుదీర్ఘమే అని చెప్పాలి..
వైయస్సార్సీపి సిద్ధం సభలతో మంచి ఊపులో ఉండగా.. రక్తి కట్టని తాడేపల్లిగూడెం చిలకలూరిపేట సభలు టిడిపి క్యాడర్ ని అయోమయంలో పడేసాయి...
అయితే ఆ పార్టీకి అధికార పార్టీ వైసీపీపై లెక్కలేనంతగా దుష్ప్రచారం చేసే రోజులు మాత్రం పెరిగాయి..
ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి...
కావలసినంత విష ప్రచారం రానున్న ఎన్నికల రోజుల్లో టిడిపి దాని అనుకూల మీడియా చేస్తుందనే విషయాన్ని హెచ్చరించారు...
అందుకు తగ్గట్టే టిడిపి అనుకూల దినపత్రికలో హనీమిరెడ్డి ఎక్కడ అనే హెడ్డింగ్ తో ఒక వార్త కథనం వచ్చింది...
దాన్ని హైలెట్ చేస్తూ టిడిపి అధికార పేజీలో ఆ క్లిప్పింగ్ ను పోస్ట్ చేసి ఇలా వైసీపీ అభ్యర్థులందరూ ఎన్నికలలో పోటీ చేయకుండా ఇక పారిపోతుంటారు అని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంది..
గురువింద గింజ తన నలుపు ఎరుగనట్లు ఇంతవరకు పొత్తుల కుంపటిలో ఎవరు ఏ సీట్లు అనేది నిర్ధారించుకోలేక జనసేన...టిడిపి.. బిజెపి కూటమి ఆపసోపాలు పడుతుంది..
మరోవైపు ప్రకటించిన అభ్యర్థుల విషయంలో వెల్లువెత్తుతున్న అసంతృప్తి... అసమ్మతి గళాలతో సతమతమవుతుంది టిడిపి... జనసేన...
మరోవైపు బిజెపి పాత కాపులు... కావాలనే ఓడిపోయే సీట్లు బిజెపికి కేటాయించడంతోపాటు... బిజెపిలోకి టిడిపి నుండి వలస వచ్చిన వాళ్లకే టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇస్తున్నారని వారు లేఖాస్త్రం సంధించారు...
ఎన్నికల ఓటింగ్ కి ఎక్కువ సమయం ఉన్న అది ఏవిధంగా వినియోగించుకోవాలి అనేది వైసిపి అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బాగానే తెలుసు ... ముందు మీ సంగతి మీరు చూసుకోండి అని వైసీపీ శ్రేణులు హితవు చెబుతున్నాయి..
ఇక హనీమిరెడ్డి రాజకీయ ఆరంగ్రేటం చేయడంతో పాటు అద్దంకి నియోజకవర్గంలో పాగా వేసేందుకు తన ప్రయత్నం తీవ్రంగానే చేస్తున్నారు..
ఇప్పటికే విద్యా వైద్యాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అంటూ ఎమ్మెల్యేగా గెలిస్తే అద్దంకిలో వంద పడకల ఆసుపత్రి ఇంజనీరింగ్ కాలేజ్ ని నెలకొల్పుతానని హామీ ఇచ్చారు..
ఇంకా అన్ని విధాలుగా అద్దంకి నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడతానని హామీ ఇస్తూ ఇప్పటికే నియోజకవర్గంలో పలు గ్రామాలలో తన సొంత నిధులతో తనకు చేతనైన విధంగా సమస్యలు పరిష్కరిస్తూ ఆర్థికంగా వైద్య పరంగా ఇబ్బందులు ఉన్నవారికి తన చేతనైన సాయం చేస్తున్నారు..
ఇదే టిడిపి వర్గీయులకు కంటగింపుగా మారింది... 16వ తేదీన జగన్మోహన్ రెడ్డి అధికారికంగా అభ్యర్థులను ప్రకటించక ముందు హనిమిరెడ్డికి టికెట్ లేదు అనే ప్రచారం విస్తృతంగా టిడిపి చేస్తుంది..
ప్రస్తుతం ఈ రెండు రోజుల నుంచి ఆయన ఎవరికి అందుబాటులో లేకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు.. పోటి నుండి పారిపోయారు అనే కొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టింది..
ఇలాంటి ఎన్ని ప్రచారాలకు అయినా టిడిపి సిద్ధమవుతుంది...
ఇలాంటి దుష్ప్రచారాలు నమ్మకుండా వాటిని తిప్పి కొట్టాలి అని ఇప్పటికే స్పష్టం చేసిన సీఎం జగన్ పిలుపుమేరకు వైసీపీ శ్రేణులు ముందుకు సాగాల్సిందే...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0