సొంత గూటికి చేరి వైసిపి అధినేత జగన్ ని కలిసిన హిందూపురం కౌన్సిలర్ లు
సొంత గూటికి చేరి వైసిపి అధినేత జగన్ ని కలిసిన హిందూపురం కౌన్సిలర్ లు
వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ని శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంకు చెందిన నలుగురు కౌన్సిలర్లు కలిశారు...
టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే హిందూపురం మునిసిపాలిటీలో కౌన్సిలర్లను భయపెట్టి, మభ్యపెట్టి తమ పార్టీలో చేర్చుకుని మునిసిపల్ ఛైర్మన్ స్ధానం దక్కించుకునేందుకు కుట్ర పన్నారు...
వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను భయపెట్టి టీడీపీలో చేర్చుకున్నారు, వీరిలో మల్లిఖార్జున, పరుశురాముడు, రహమత్బీ, మణిలు తమ తప్పు తెలుసుకుని తిరిగి వైఎస్సార్సీపీలో చేరారు....
శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్, సీనియర్ వైసీపీ నాయకుడు నవీన్ నిశ్చల్.. హిందూపురం వైఎస్సార్సీపీ సమన్వయకర్త దీపికతో కలిసి వీరంతా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్ను కలిశారు. అధికార పార్టీ నేతల ప్రలోభాలు, బెదిరింపులకు తామిక తలొగ్గేదిలేదని ఏది ఏమైనా ప్రజల పక్షాన నిలబడి వైఎస్సార్సీపీ వెంటే నడుస్తామన్నారు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0