వైసిపి ప్రభుత్వంకి కక్ష సాధింపు చర్యలపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదు
వైసిపి ప్రభుత్వంకి కక్ష సాధింపు చర్యలపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదు
వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు సమిధలుగా మారిన పేదవాడి టిడ్కో గృహాలు-చేతకాని ముఖ్యమంత్రి చెత్త పరిపాలన- అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్_
అద్దంకి పట్టణంలోని 12వ వార్డులో మంగళవారం ఉమ్మడి కుటుంబం అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు, ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ మే 13న జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను ఎంపీగా తేనేటి కృష్ణ ప్రసాద్ ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ..
నాడు తెలుగుదేశం పార్టీ హయాంలో ఇంటింటికి తిరిగి ఎవరైనా పింఛన్లకు అర్హులు ఉన్నారా అని ఆరా తీసి మరి పింఛన్లు సంక్షేమ పథకాలను అందిస్తే నేడు వైసీపీ పార్టీ నేతలు కొత్తవి మంజూరు చేయకపోగా టిడిపి సానుభూతిపరులు మద్దతుదారులు నెపంతో దాదాపు 50 పింఛన్లను అకారణంగా తొలగించారని అన్నారు.
పట్టణంలో డ్రైనేజీ పారిశుద్ధ్య వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, టిడిపి అధికారంలోకి రాగానే పట్టణ ప్రణాళికలు రూపొందించి శాశ్వత పరిష్కారం చూపెడతామన్నారు..
నాడు పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు దాదాపు 85 కోట్ల రూపాయలు మంజూరు చేయించడం జరిగిందని,వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో పనులు పూర్తిచేసి పట్టణ ప్రజలకు తాగునీరు అందించలేని అసమర్ధ ప్రభుత్వంగా నిలిచిపోయిందని పట్టణ ప్రజలు ఈ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉందన్నారు.
వైసిపి అధికారంలోకి వచ్చినట్టు నుండి విద్యుత్ చార్జీలు సర్ చార్జ్,ఫిక్సిడ్ చార్జ్,ట్రూ అప్ చార్జీల పేరిట 9సార్లు పెంచి సామాన్యుడిపై మోయలేని భారం వేశాడని, బస్ ఛార్జ్లను 3సార్లు పెంచి పేదవాడికి బస్సు ప్రయాణాన్ని దూరం చేసిందన్నారు.
జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక పేదల సొంతింటి కల పెనుభారంగా తయారైందని. అధికారంలోకి రావడం కోసం నోటికొచ్చిన అబద్దాలు చెప్పి ముఖ్యమంత్రి ఇళ్ళు కట్టి ఇవ్వడానికి నానా అబద్ధాలు చెప్పి పేదలను మోసం చేశాడు అన్నారు.
పేదవాడి సొంత ఇంటి కల నెరవేర్చడం కోసం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 3,13,832లక్షల గృహ సముదాయాల నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు.
అందులో భాగంగా మొదటి దశలో అద్దంకి నగర పంచాయతీ పరిధిలోని శింగరకొండ వద్ద వెయ్యికి పైగా టిడ్కొ ఇళ్ల నిర్మాణాలు 90%పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు.
వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మిగిలిన 10% పనులు పూర్తి చేయకపోవడం దారుణమని, పేదల పట్ల వైకాపా చిత్తశుద్ధి ఏపాటిదో లబ్దిదారులు అర్ధం చేసుకోవాలని సూచించారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా చెత్తపై, మరుగు దొడ్లపై పనులు వేసిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచాడు అన్నారు.
మద్యనిషేధం హామీ ఇచ్చి, ప్రమాదకర మద్యం అమ్ముతూ పేద ప్రజల ప్రాణాలు తీస్తూ వారి కుటుంబాలను నడిరోడ్డులో పడవేస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని మరో 12 రోజుల్లో సాగనంపేందుకు మహిళలంతా ఏకమవ్వాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో టిడిపి, బిజెపి,జనసేన నేతలు పట్టణ కౌన్సిలర్లు, గొట్టిపాటి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0