టిడిపి పిచ్చి పరాకాష్టకు.. పెన్షన్లపై కూటమి నాయకుల తల తోకాలేని స్టేట్మెంట్లు.. కుట్ర బట్టబయలు
టిడిపి పిచ్చి పరాకాష్టకు.. పెన్షన్లపై కూటమి నాయకుల తల తోకాలేని స్టేట్మెంట్లు.. కుట్ర బట్టబయలు
ఐవిఆర్ కాల్స్ చేస్తూ టిడిపి పెన్షన్ల విషయమై.. కుట్ర చేస్తుంది జగన్మోహన్ రెడ్డి అనే అంశాన్ని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంది...
దీంతో టిడిపి పిచ్చి పరాకాష్టకు చేరినట్లుగా కనబడుతుందని రాజకీయ మేధావులు అంటున్నారు..
అసలు వాలంటీర్ వ్యవస్థ మీద నిమ్మగడ్డ రమేష్ ఎలక్షన్ కమిషన్కు చేసిన ఫిర్యాదు వల్ల వాలంటీర్ల సేవలు నిలిపివేయబడ్డాయి..
అలాంటి నిమ్మగడ్డ మీద ఇప్పటికీ ఒక పల్లెత్తు మాట కూడా టిడిపి అనలేదు...
ఆయన చేసింది ఖండించలేదు..
మరి చంద్రబాబు డైరెక్షన్ లేకుండానే ఇదంతా జరిగిందా అని సామాన్య జనాలు సైతం ప్రశ్నిస్తున్నారు..
రాజమండ్రి టిడిపి నగర నియోజకవర్గ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు చంద్రబాబు లోకేష్ కి చెప్పి వాలంటీర్ల సేవలను తానే ఆపించాను అని చెప్పిన విషయం సంబంధిత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
మరి దీని మీద కూడా టిడిపి అధినేత స్పందించలేదు..
మరి ఇలాంటివి గమనించే స్థితిలో సామాన్య ప్రజలు లేరు అనే భావనలో చంద్రబాబు నాయుడు ఉండటం అనేది అమాయకత్వమే అవుతుంది..
ఇక దగ్గుబాటి పురందేశ్వరి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ dbt ద్వారా పెన్షన్లు పంపిణీ చేయవచ్చు కదా అని సలహా ఇచ్చారు..
ఈ పెన్షన్ సౌకర్యం పొందుతుంది వృద్ధులు రోగగ్రస్తులు దివ్యాంగులు తదితరులు.,.
మరి డి బి టి ద్వారా పెన్షన్ ట్రాన్స్ఫర్ చేస్తే వారు వెళ్లి బ్యాంకుల్లో నిరీక్షించి చలానా ఫారాలు ఫిల్ చేసి విత్ డ్రా చేసుకోగలరా పురందేశ్వరి గారు అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు..
ఇక పవన్ కళ్యాణ్ తన సినిమాలు రిలీజ్ అయినప్పుడు సినిమా హాల్ల దగ్గర రెవెన్యూ అధికారులను ఉంచుతున్నారు కదా అదే విధంగా పెన్షన్ ని పంపిణీ ఎందుకు చేయలేరు అధికారుల ద్వారా అని ఆయన ప్రశ్నిస్తున్నారు...
అయ్యా పవన్ కళ్యాణ్ గారు 66 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేయాలి..
1500 థియేటర్లు రాష్ట్రంలో ఉంటే థియేటర్ కు ఒకరు చొప్పున 1500 మంది రెవెన్యూ అధికారులు సరిపోతారు మీ సినిమాలు రిలీజ్ అప్పుడు వచ్చే ప్రభుత్వ ఆదాయ వసూళ్లకు..
ఇప్పటివరకు రెండున్నర లక్షల మంది వాలంటీర్లు ఉదయాన్నే తెల్లవారుజామున ఇంటికి వెళ్లి పంపిణీ చేస్తేనే 66 లక్షల మంది వృద్ధులు పెన్షన్ పొందుతున్నారు..
సచివాలయ ఉద్యోగులకు నిత్యం చేయవలసిన పనులు అనేకం ఉంటాయి...
వారు ఎంతమందికి ఇంటింటికి తిరిగి పంపిణీ చేయగలరు అనేది గమనించండి పవన్ గారు అని ట్ల్రోల్ చేస్తున్నారు...
ఇక టిడిపి అనుకూల ఎలక్ట్రానిక్ మీడియా మహా టీవీలో ప్రభుత్వం అవకాశం ఇస్తే టిడిపి కార్యకర్తలు ఇంటింటికి తిరిగి పెన్షన్లు పంపిణీ చేస్తారు అని చెప్పటం టిడిపి దాన్ని అనుకూల మీడియాను చూసి జాలి పడక తప్పదు అని అభిప్రాయం కలుగుతుంది...
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు రోజు కూలి పనులకు వెళ్లి ఎండలో పనిచేయటం లేదా ఒక్క రోజు ఎండలో నిలబడి 3వేల రూపాయల పెన్షన్ తీసుకోవడానికి ఏం నొప్పి అని వ్యాఖ్యానించడం దుమారం లేపుతుంది
ఏది ఏమైనాప్పటికీ తెలుగుదేశం చేసిన అనాలోచిత నిర్ణయం వల్ల అనేకమంది వృద్ధులు నేడు ఇబ్బందులు పడే పరిస్థితి దాదాపు జూన్ నెల దాకా కూడా కొనసాగుతుంది...
వాలంటీర్లు లబ్ధిదారు లను వైసీపీకి అనుకూలంగామార్చే సామర్థ్యం ఉంది అనుకోవడం అవివేకం.. వాలంటీర్లలో కూడా పలుచోట్ల పలు గ్రామాలలో విభిన్న పార్టీల వాళ్లు కూడా ఉన్నారు.. వాలంటీర్లు ఏదో ప్రభావితం చేస్తారు అనే అనుమానంతో ఏదో చేయబోయి అసలుకే మోసం తెచ్చుకున్న పరిస్థితి ఇవాళ టిడిపిది..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0