బలి అయిన నిండు ప్రాణం.. బిక్కుబిక్కు మంటున్న చిన్నారులు
బలి అయిన నిండు ప్రాణం.. బిక్కుబిక్కు మంటున్న చిన్నారులు
తెలుగుదేశం...జనసేన సోషల్ మీడియా అరాచకం గీతాంజలి నిండు ప్రాణాన్ని బలిగొంది...
ఇద్దరు చిన్నారి బంగారు తల్లుల పసి హృదయాలకు మాతృమూర్తి మమకారాన్ని దూరం చేసింది..
ఇక తల్లి వారిని బుజ్జగిస్తూ..గోరుముద్దలు తినిపిస్తూ తమ అలక తీరుస్తూ... లాలిస్తూ... పాలిస్తూ.. తమకు ప్రేమానురాగాలను అందించడానికి తమ చెంత ఉండదు అనే ఆలోచన ఆ పసి మనసులను పిండి వేస్తుంది...
విసన్న వదనాలతో కనుగుడ్లలో పొంగి పొర్లుతున్న దుఃఖంతో బాధను అనుభవిస్తున్న ఆ లేత మనసులను చూసిన ప్రతి ఒక్కరి హృదయం దుఃఖంతో పొంగిపొర్లుతుంది...
తన సొంత ఇంటి కల నెరవేరబోతుందనే ఆనందంతో ఆమె ఒక యూట్యూబ్ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు తను చెప్పిన సమాధానం తన ప్రాణాన్ని తీసివేస్తుందని ఆమె ఊహించి ఉండలేదేమో... గత ఐదు సంవత్సరాల నుండి అమ్మ ఒడి వస్తుంది... ఇప్పుడు జగనన్న ఇచ్చిన ఇంటి స్థలం పట్టా అందుకోవడం ద్వారా సొంత ఇంటి డ్రీమ్ నెరవేరబోతుంది అన్న ఆమెను...ట్రోలింగ్ చేస్తూ పచ్చి బూతులతో అసభ్యకరంగా జనసేన తెలుగుదేశం సోషల్ మీడియా కార్యకర్తలు దాడి చేయడంతో ఆ నిండు ప్రాణం బలైపోయింది...
ఆమె సొంత ఇంటి కల సాకారం చేసుకోకుండా నే ఆమె జీవితం బుగ్గిపాలైంది...
ఈ విషయంలో వైసిపి సోషల్ మీడియా కూడా సంయమనం పాటించాలి...
ఈ సంఘటనలో ఆమె బీసీ మహిళ లేదా ఓసి లేదా ఎస్సీ లేదా మైనారిటీ అనే అంశం కాదు ఒక పేదింటి మహిళగా భావిస్తే బాగుంటుంది...
ఏ సోషల్ మీడియా అయినా హద్దు దాటి ముఖ్యంగా మహిళల విషయంలో శృతిమించిన వికృత రూపాన్ని ప్రదర్శించకుండా ఉంటే ఎంతో మంచిది...
గీతాంజలి లాంటి సున్నిత మనస్కులు తమని తాము ఆత్మార్పణం చేసుకునే పరిస్థితికి రాకుండా ఉంటారు..
పాపం అభం శుభం తెలియని ఆ అమాయకురాలు మూడు రోజులు మృత్యువుతో పోరాడి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది..
సోషల్ మీడియా అరాచకం ఆ కుటుంబానికి ముఖ్యంగా ఆ తల్లి లేని పిల్లలకు తీరని అన్యాయం చేసింది
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0