కడప ఎంపీగా షర్మిల తను గెలిచేందుకు ప్రధాన ఆయుధంగా సునీత
కడప ఎంపీగా షర్మిల తను గెలిచేందుకు ప్రధాన ఆయుధంగా సునీత
కడప ఎంపీగా పోటీ చేస్తున్న వైఎస్ షర్మిల తన ప్రచారాన్ని కడపలో ప్రారంభించారు..
కడపలో బస్సు యాత్ర మొదలుపెట్టిన షర్మిల తనతో పాటు వైఎస్ సునీతను కూడా ప్రచారంలో వాడుకుంటున్నారు..
బస్సులో తనతోపాటు సునీతని కూడా తీసుకువెళ్తున్నట్లు స్పష్టం అవుతుంది..
షర్మిల గుమి కూడిన జనాలను ఉద్దేశించి మాట్లాడుతూ... తన మూస పాటే పాడింది... రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను అంటూ,, రాజశేఖర్ రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డి కుమార్తె సునీత అని సునీతను పరిచయం చేసింది...
కడప ఎంపీగా వివేకానంద రెడ్డిని చంపిన అవినాష్ రెడ్డికి ముఖ్యమంత్రి జగన్ టికెట్ ఇచ్చారని హంతకులను గెలిపించొద్దని... రాజశేఖర్ రెడ్డి తనయను తనను గెలిపించాలని కోరింది...
అయితే ఇక్కడ ఆమె ఊహించని పరిణామం జరిగింది..
ఆమె తనను గెలిపించమని కోరిన సమయంలో జై జగన్ అనే నినాదాలు ఆ గుంపులోని వాళ్ళు కొందరు చేయడంతో... ఆమె కంగు తిన్నది..
పాపం షర్మిల అనిపించక మానదు..
రాజశేఖర్ రెడ్డి తనయగా చెప్పుకుంటూ.. వివేకానంద రెడ్డి మర్డర్ ని ప్రధానంగా హైలెట్ చేస్తూ ఎన్నికల బరిలో గెలవాలనే తాపత్రయం షర్మిల పడుతున్నట్లే...
మరి ఏమవుతుందో వేచి చూడాల్సిందే...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0