రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించి న్యాయం పక్క నిలబడాలని కోరిన షర్మిల
రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించి న్యాయం పక్క నిలబడాలని కోరిన షర్మిల
వివేకానంద రెడ్డి వర్ధంతి సభలో షర్మిల తో పాటు తెలుగుదేశం పులివెందుల అభ్యర్థి బీటెక్ రవి జమ్మలమడుగు బిజెపి అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి పాల్గొన్నారు...
ఒకపక్క రాజకీయం కోసం కాదు అంటూనే,ఐదు సంవత్సరాల నుంచి బాబాయ్ వివేకా మర్డర్ కేసు ఒక కొలిక్కి రాలేదు.. అన్నా అని మేము పిలుస్తున్న వాళ్లే వివేకాహంతకులకు అండగా ఉన్నారు... పులివెందుల ప్రజలు కడప జిల్లా ప్రజలు రాష్ట్ర ప్రజలు అందరూ ఆలోచించండి న్యాయం ధర్మము గెలవాలి న్యాయం పక్క మీరందరూ నిలబడాలి అని తన అన్న జగన్మోహన్ రెడ్డిని ఆయన ప్రభుత్వాన్ని గద్దె దించాలి అని స్పష్టంగానే సందేశాన్ని ఇచ్చింది షర్మిల..
అయితే ప్రసంగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చూసిన నేటిజన్లు విరుచుకుపడుతున్నారు...
మాటిమాటికి దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పొద్దమ్మా ఆయన పరువు తీయొద్దు అని కొందరు అంటున్నారు..
తెలంగాణలో నిన్ను నమ్ముకున్న చెల్లెళ్ల బాధలు తీర్చావా తల్లి అని కొందరు ప్రశ్నిస్తున్నారు...
తెలుగుదేశం ముసుగులో కాంగ్రెస్ తరపున టిడిపికి ఎన్నికలలో సహాయం చేసేందుకు వచ్చావని అందరికీ తెలుసులే అమ్మ మురుసుపల్లి షర్మిల శాస్త్రి అని కొందరు కామెంట్ చేస్తున్నారు...
వైయస్ రాజశేఖర్ రెడ్డి కి కుడి భుజంగా ఉన్న వైఎస్ వివేకానంద మరణాన్ని ఆయన మరణించిన తీరుని ఎవరు సమర్ధించడానికి లేదు...
ఆయన హత్య కేసులో నిందితులకు శిక్ష పడవలసిందే...అయితే వివేకానందను ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓడించడానికి కుయుక్తులు పన్నిన శత్రు శిబిరం బీటెక్ రవి లాంటి వాళ్లతో చేతులు కలపడం ఏమిటని ప్రశ్న తలెత్తడంతో పాటు...
వివేకానందను కుటుంబానికి దూరం చేసి ఆయనను ఆర్థికంగా ఇబ్బందులు పెట్టిన మరి మీ అంతర్గత వ్యవహారాలు ఏంటి? ఆయన ఎందుకు రెండో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఇలాంటి ప్రశ్నలకు మరి సమాధానాలు ఇవ్వకుండా...
ఆస్తి రెండో భార్య షమీమ్ కొడుకుకి వివేకా రాస్తాడనే భయంతో ...అధికారంలో ఉన్న బీటెక్ రవి జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డితో మీకు ఉన్న సత్సంబంధాలను ఉపయోగించి వివేకాను హత్య చేయించారు అనే ఆరోపణలపై నిర్దిష్టమైన వివరణ మరి సునీత రెడ్డి ఎందుకు ఇవ్వడం లేదు అని వైయస్సార్సీపి సోషల్ మీడియాలో ప్రశ్నలు వైసిపి వర్గీయులు సంధిస్తున్నారు....
కేవలం వివేకానంద రెడ్డి హత్య కేసు వల్లే ముఖ్యమంత్రిగా జగన్ గెలిచాడు అని తెలుగుదేశం పార్టీ చేస్తున్న విస్తృత ప్రచారం ప్రజలలో వెగటు పుట్టిస్తుంది అని చెప్పక తప్పదు..
గతంలో నవరత్నాల వల్ల రాష్ట్రం శ్రీలంక అవుతుంది అని ఎగతాళి చేసిన చంద్రబాబునాయుడు..టిడిపి తాము అంతకన్నా ఎక్కువ ఖర్చుతో కూడిన పథకాలను అమలు చేస్తామని ప్రజలని ఎలా ఒప్పించగలము అనే ఆలోచన లేకుండా వివేకానంద మర్డర్ కేస్ లాంటి అస్త్ర శస్త్రాలను వదిలేయడం ఎంతైనా మంచిది...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0