వైయస్ కుటుంబానికి 30 ఏళ్ల రాజకీయ ప్రత్యర్థి సతీష్ కుమార్ రెడ్డి వైసీపీలో చేరిక
వైయస్ కుటుంబానికి 30 ఏళ్ల రాజకీయ ప్రత్యర్థి సతీష్ కుమార్ రెడ్డి వైసీపీలో చేరిక
ఒకప్పటి తెలుగుదేశం పులివెందుల నేత ఎస్ వి సతీష్ రెడ్డి తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు..
దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి మీద వైయస్ జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేసి తెలుగుదేశం తరఫున ఓడిపోతూ వస్తున్నారు..
30 ఏళ్ల నుండి వైయస్ కుటుంబానికి ప్రత్యర్థిగా నియోజకవర్గ స్థాయిలో తెలుగుదేశం పార్టీ నిర్మాణానికి కృషి చేశారు..
2019 ఎన్నికలలో జగన్ పై ఓటమి అనంతరం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు..
పార్టీ అభివృద్ధి కోసం పులివెందులలో కష్టపడి పనిచేసిన తనకు తగిన గుర్తింపు లేదని నాలుగు సంవత్సరాల నుండి ఏ పార్టీ పంచన చేరకుండా నిశ్శబ్దంగా ఉన్నారు..
అయితే సతీష్ కుమార్ రెడ్డి వైసీపీ నుండి ఆహ్వానం వస్తే చేరేందుకు సుముఖంగా ఉన్నారనే వార్తలు గత కొంతకాలం నుండి వినవస్తున్నాయి...
ఈ నేపథ్యంలో పులివెందుల బాధ్యతలను పూర్తిగా పర్యవేక్షించేందుకు తను సీఎంగా పాలన వ్యవహారాలలో మునిగితేలుతున్నందున సతీష్ కుమార్ రెడ్డి ని నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించేందుకు సీఎం జగన్ ఆహ్వానించినట్లు సమాచారం...
భవిష్యత్తులో విశాఖపట్నం పాలనా రాజధానిగా కార్యకలాపాలు సీఎం జగన్ మరల తిరిగి అధికారంలోకి వస్తే నిర్వహంచవలసి ఉన్నది..
ఇంకోవైపు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పంచన వైయస్ సునీత అనధికారికంగా టిడిపి చెంత చేరి ఉండడంతో తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో సమర్ధుడైన వ్యక్తిని నియమించాలనే ఉద్దేశంతో రాజకీయ వ్యూహంలో భాగంగా సతీష్ కుమార్ రెడ్డిని పార్టీలో జగన్ చేర్చుకున్నట్లు సమాచారం...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0