జగన్ కోసం మేం సిద్ధం బూత్ లెవెల్ ప్రచార కార్యక్రమం నేటి నుండి ప్రారంభం
జగన్ కోసం మేం సిద్ధం బూత్ లెవెల్ ప్రచార కార్యక్రమం నేటి నుండి ప్రారంభం
*‘జగన్ కోసం సిద్ధం’ నేటి నుంచి ప్రారంభం -సజ్జల*
*స్టార్ క్యాంపెయినర్లతో కలిసి ఇంటింటికీ మేనిఫెస్టో*
*సినీ హీరోలు కాదు పేద ప్రజలే మా స్టార్ క్యాంపెయినర్లు*
*వివిధ వర్గాల నుంచి 12 మందిని స్టార్ క్యంపెయినర్లుగా ఎంపిక చేశాం*
ఎన్నికల ప్రచారంలో భాగంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఇప్పటికే ‘సిద్ధం’ పేరిట బహిరంగ సభలు, ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్ర చేపట్టిన పార్టీ క్యాడర్లో నూతన ఉత్సాహాన్ని నింపారు. తాజాగా కలలు నిజం చేయడానికి ‘‘జగన్ కోసం సిద్ధం’’ పేరుతో నూతన కార్యక్రమానికి వైయస్ఆర్ సీపీ శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని నేడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, ఇతర పార్టీ నేతలు ప్రారంభించారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ..
వైయస్ఆర్సీపీ మేనిఫెస్టోను ఇంటింటికీ తీసుకెళ్లడమే లక్ష్యంగా ‘‘జగన్ కోసం సిద్ధం’’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. తాజాగా పార్టీ అధ్యక్షులు, సీఎం జగన్ ఇటీవల విడుదల చేసిన మేనిఫెస్టోను వైయస్ఆర్సీపీ స్టార్ క్యాంపెయినర్లతో కలిసి నేతలు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారంలో పాల్గొనున్నారని పేర్కొన్నారు. ఇచ్చిన మాట తప్పకుండా.. ఇప్పటికే 2019 మేనిఫెస్టోలోని వాగ్దానాలను 99 శాతం నెరవేర్చి ప్రజల్లో స్థిరమైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఏర్పరుచుకున్న వ్యక్తి సీఎం జగన్ అని చెప్పారు. నేటి నుంచి చేపట్టబోయే ‘‘జగన్ కోసం సిద్ధం’’ కార్యక్రమం ద్వారా స్టార్ క్యాంపెయినర్లు, పార్టీ అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలు మేనిఫెస్టోను ఇంటింటికీ తీసుకెళ్లి వివరించనున్నారని వెల్లడించారు. ఏపీలో గత ఐదేళ్లలో 87 శాతం పేదలకు పథకాలు అందాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
"2019-24 మధ్య అమలు చేసిన సంక్షేమం.. ఈ దఫా అధికారంలోకి వస్తే కొనసాగిస్తామని సీఎం జగన్ చెప్పారో వాటిని వివరిస్తారు. నేటి నుంచి అన్ని నియోజకవర్గాల్లో ఇంటింటికి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాగానే ఏం చేయబోతుందనేది తెలియజేసేందుకు క్యాలెండర్ రూపంలో మేనిఫెస్టోను ఇంటింటికీ అందిస్తాం. మేం ఇచ్చే ప్రతి పథకం వివరాలు ఆ క్యాలెండర్ లో పేర్కొంటాము. చంద్రబాబులాగా మేనిఫెస్టోను పక్కన పడేసే విధంగా కాకుండా.. ఒక ప్రామాణికంతో రికార్డెడ్ గా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం, మా మేనిఫెస్టో హామీలను అమలు చేయకపోతే నిలదీసే హక్కు ప్రజలకు ఉంటుంది. వైఎస్సార్ సీపీ తరఫున 12 మంది స్టార్ క్యాంపెయినర్లను ఎంపిక చేశాం. వివిధ సామాజిక వర్గాల నుంచి వీళ్లను ఎంపిక చేసి ఈసీకి అందజేశాం" అని సజ్జల తెలిపారు
*ఎవరి ఈ స్టార్ క్యాంపెయినర్లు*
అయితే ఇతర పార్టీలకు ఉన్నట్లు వైయస్ఆర్సీపీకి సీని హిరోలు స్టార్ క్యాంపెయినర్లుగా లేరని, పేదలే వైసీపీ స్టార్ క్యాంపెయినర్లని, వివిధ పేద వర్గాలనుంచి 12 మంది స్టార్ క్యాంపెయినర్లను ఎంపిక చేశామని, వారు కూడా ఈ ప్రచారంలో పాల్గొంటారని సజ్జల తెలిపారు. ఈ 12 మంది పేర్లు ఈసీకు కూడా సమర్పించినట్లు వెల్లడించారు.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0