ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్స్ పరిశుభ్రత ఫోటోల అప్లోడ్ బాధ్యత ఇక సచివాలయ స్కూల్ వెల్ఫేర్ అసిస్టెంట్ లదే
ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్స్ పరిశుభ్రత ఫోటోల అప్లోడ్ బాధ్యత ఇక సచివాలయ స్కూల్ వెల్ఫేర్ అసిస్టెంట్ లదే
ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్స్ పరిశుభ్రతకు సంబంధించి ఇక ఫోటోల అప్లోడ్ బాధ్యతను సచివాలయ స్కూల్ వెల్ఫేర్ అసిస్టెంట్లకు అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసింది...
గతంలో ఈ బాధ్యత పాఠశాల ఉపాధ్యాయుల పైన ఉండేది..వారు సదరు బాధ్యతను పెద్ద గుదిబండగా భావించారు...
ఉపాధ్యాయులుగా తాము పాఠాలు చెప్పాలా మరుగుదొడ్ల ఫోటోలు తీయాల అనే నిరసన వైసిపి ప్రభుత్వ హయాంలో వ్యక్తం చేశారు..
ఈ నేపథ్యంలో ఆ బాధ్యతల నుంచి వారిని తొలగిస్తూ పది రోజుల క్రితం జీవో జారీ చేసిన ప్రభుత్వం తాజాగా ఆ బాధ్యతను సచివాలయ స్కూల్ వెల్ఫేర్ అసిస్టెంట్లకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది..
తాజా ఉత్తర్వుల మేరకు వారంలో రెండు రోజులు సోమా గురువారాలు ఈ బాధ్యతను వారు నిర్వర్తించాలి..
అదేవిధంగా పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ సభ్యులు బుధవారం శుక్రవారం పాఠశాలను సందర్శించి మరుగుదొడ్ల పారిశుధ్య నిర్వహణ ఇతర అంశాలపై పర్యవేక్షణ చేయాలి...
నూతన బాధ్యతలు స్వీకరిస్తున్న సచివాలయ స్కూల్ వెల్ఫేర్ అసిస్టెంట్లకు శుభాకాంక్షలు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0