చంద్రబాబుకి షాక్.. కుప్పంలో కీలక టిడిపి నేతలు వైసీపీలో చేరిక
చంద్రబాబుకి షాక్.. కుప్పంలో కీలక టిడిపి నేతలు వైసీపీలో చేరిక
చిత్తూరు జిల్లా:-
మేమంతా సిద్ధం బస్సుయాత్రలో గంగాధరనెల్లూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నుంచి ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యనేతలు చేరారు..
అమ్మగారిపల్లె స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన టీడీపీ సీనియర్ నేత, 2019లో టీడీపీ తరపున గంగాధరనెల్లూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఎ. హరికృష్ణ చేరారు..
మాజీ మంత్రి కుతూహలమ్మ కుమారుడు ఎ హరికృష్ణ...కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి కె నారాయణస్వామి పాల్గొన్నారు..
సీఎం సమక్షంలో వైయస్ఆర్ సీపీలో చేరిన కుప్పం టీడీపీ నేతలు:-
కుప్పం నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ సీనియర్ నేతలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైయస్ఆర్ సీపీలో చేరారు...
మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా అమ్మగారిపల్లె స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలో కుప్పం నియోజకవర్గానికి చెందిన ఉమ్మడి చిత్తూరు జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ ఎం.సుబ్రమణ్యంనాయుడు, కృష్ణమూర్తి, బేతప్పలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు...
ఈ మేరకు వారికి సీఎం వైయస్ జగన్ వైయస్ఆర్ సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు... కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్రెడ్డి, ఎమ్మెల్సీ భరత్ పాల్గొన్నారు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0