మండుటెండలని లెక్క చేయకుండా సీఎం జగన్ ని చూసేందుకు తరలివస్తున్న జనం
మండుటెండలని లెక్క చేయకుండా సీఎం జగన్ ని చూసేందుకు తరలివస్తున్న జనం
పల్నాడు జిల్లాలో కొనసాగుతున్న ‘మేమంతా సిద్ధం’బస్సు యాత్ర...
గంటావారిపాలెం నుంచి బస్సు యాత్ర ప్రారంభం
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్రయాత్రలా సాగుతోంది.ఇవాళ మేమంతా సిద్దం బస్సుయాత్రలో పల్నాడు జిల్లా గంటావారిపాలెం నుంచి బస్సు యాత్ర ప్రారంభమైంది. దానికి ముందు నైట్ స్టే వద్ద భారీ చేరికలు జరిగాయి...
గంటావారిపాలెం నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమక్షంలో జనసేన, తెలుగుదేశం పార్టీల నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పలువురు మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు చేరారు. గంటావారిపాలెం నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైయస్.జగన్ను పల్నాడు జిల్లాకు చెందిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కలిశారు...
గంటావారిపాలెం జనసంద్రంగా మారింది... దారిపొడవునా భారీగజమాలతో ముఖ్యమంత్రికి ప్రజలు ఘనస్వాగతం పలికారు.
మేమంతా సిద్ధమంటూ.. ముఖ్యమంత్రి బస్సుతో పాటు జనప్రవాహం కదిలింది. ముఖ్యమంత్రి జగన్కు విద్యార్దులు, యువతీయువకులు, చిన్నారులతో సహా తల్లులు, అవ్వాతాతలు దారిపొడవునా సంఘీభావం తెలిపారు...
సంతమాగులూరు అడ్డరోడ్డు పాయింట్ వద్ద షెడ్యూల్లో లేకపోయినా విశేషంగా ప్రజలు తరలిరావడంతో బస్సు నుండి బయటకు వచ్చి సీఎం జగన్ చిరునవ్వుతో అభివాదం చేస్తూ ముందుకు సాగారు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0