విజేతలు ఎవరో తేల్చేది ప్రజలే అని పరోక్షంగా షర్మిల సునీతలను ఉద్దేశించి చురక వేసిన జగన్
విజేతలు ఎవరో తేల్చేది ప్రజలే అని పరోక్షంగా షర్మిల సునీతలను ఉద్దేశించి చురక వేసిన జగన్
పులివెందులే నా ప్రాణం.. విజేతలు ఎవరో తెల్చేది ప్రజలే అన్నారు జగన్..
సర్వమత ప్రార్థనల అనంతరం నామినేషన్ వేసేందుకు వెళ్లే ముందు పులివెందుల సిసిఐ గ్రౌండ్స్ లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు...
పులివెందుల అంటే అభివృద్ధి, నమ్మకం, ఒక సక్సెస్ స్టోరీ. ఈ అభివృద్ధికి కారణం వైఎస్సార్. వైఎస్సార్ బాటలో మరో రెండు అడుగులు ముందుకు వేసింది మన ప్రభుత్వం. పులివెందులలో ఏం ఉంది? అనే స్థాయి నుంచి పులివెందులలో ఏం లేదు? అనే స్థాయికి చేరుకున్నాం. అందుకే పులివెందుల ఒక విజయగాథ అంటూ తెలిపారు.
కరువు ప్రాంతంగా ఉన్న పులివెందులకు కృష్ణా జలాలు వస్తున్నాయి. నా తండ్రి, ఆ మహానేత దివంగత నేత వైఎస్సార్ వల్లే ఈ అభివృద్ధి పరుగులన్నారు. పులివెందుల కల్చర్, కడప కల్చర్, రాయలసీమ కల్చర్ అంటూ మనపై వేలెత్తి చూపిస్తున్నారు. మంచి మనసు, బెదిరింపులకు లొంగకపోవడం మన కల్చర్. టీడీపీ మాఫియా, నాలుగు దశాబ్దాల దుర్మార్గాన్ని ఎదురించింది పులివెందుల బిడ్డేనని వెల్లడించారు.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0