రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి ఐదుగురికి గాయాలు
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి ఐదుగురికి గాయాలు
బాపట్ల జిల్లా అద్దంకి మండలం తిమ్మాయపాలెం వద్ద జరిగిన రోడ్ ప్రమాదంలో ఆటో ట్రాక్టర్ ఢీ కొన్న ఘటనలో ఒకరు మృతి మరో 5 గురికీ తీవ్రగాయాలు పాలైన సంఘటన గురువారం ఉదయం జరిగింది....
మండలంలోని తిమ్మాయపాలెం వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదంలో ఫోర్ వీల్ ఆటో, ట్రాక్టర్ ఒక దానికి ఒకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది...
ఈ ప్రమాదంలో తెనాలి మండలం అంగలకుదురు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నక్క మల్లికార్జునరావు అక్కడికక్కడే మృతి చెందగా, ట్రాక్టర్ లో ఉన్న మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి...
సమాచారం అందుకున్న అద్దంకి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు...
గాయపడిన వారిని నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్ట్ నిమిత్తం అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0